గతేడాది నవంబర్లో ఈడెన్ గార్డెన్ వేదికగా బంగ్లాదేశ్తో చారిత్రిక డే/నైట్ టెస్టు ఆడింది టీమిండియా. ఈ మ్యాచ్లో కోహ్లీసేన ఘనవిజయం సాధించింది. ఈ పోరు తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ భవిష్యత్లో మరిన్ని పింక్ బాల్ టెస్టులకు భారత జట్టు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా సిరీస్లోనూ డే/నైట్ టెస్టు ఆడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ విషయంపై ఇప్పటికీ ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్టు ఆడే వీలుందని చెప్పారు.
2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో అనుభవం లేని కారణంగా పింక్ బాల్ టెస్టుకు నో చెప్పింది బీసీసీఐ. కానీ ఇటీవల ఆసీస్తో వన్డే సిరీస్ ప్రారంభంలో ఈ విషయంపై ఓ స్పష్టత ఇచ్చాడు టీమిండియా సారథి కోహ్లీ. ఆస్ట్రేలియాలో డే/నైట్ టెస్టు ఆడతామని తెలిపాడు.