తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిరీస్​ విజయంపై కోహ్లీసేన దృష్టి.. ప్రతీకారంతో విండీస్ - india national cricket team

భారత్-వెస్టిండీస్​ మధ్య ఆదివారం రెండో టీ20 జరగనుంది. ఇందులో గెలవాలని ఇరుజట్లు కసరత్తులు చేస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

సిరీస్​ విజయంపై కోహ్లీసేన దృష్టి.. ప్రతీకారంతో విండీస్
విరాట్ కోహ్లీ-కీరన్ పొలార్డ్

By

Published : Dec 8, 2019, 5:10 AM IST

తొలి టీ20లో వెస్టిండీస్​పై రికార్డు ఛేదనతో టీమిండియా అద్భుత విజయం సాధించింది. సిరీస్​లో 1-0 ఆధిక్యం సంపాదించింది. తిరువనంతపురం వేదికగా నేడు.. రెండో టీ20లో తలపడనుంది. ఇందులోనూ గెలిచి సిరీస్​ పట్టేయాలని చూస్తోంది. ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని విండీస్​ భావిస్తోంది.

తొలి టీ20లో 208 పరుగుల భారీ లక్ష్యాన్ని 8 బంతులు మిగిలుండగానే ఛేదించి గెలిచింది కోహ్లీ సేన. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ భారత్‌కు బలంగా మారింది. తొలి మ్యాచ్‌లో విఫలమైన రోహిత్‌.. ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని కసిగా ఉన్నాడు. ఓపెనర్‌ కేఎల్​ రాహుల్‌, కెప్టెన్ విరాట్​ కోహ్లీ.. తొలి మ్యాచ్‌ తరహాలోనే రాణించాలని భావిస్తున్నారు. మిగతా వారు.. అవకాశం దొరికితే తమ వంతు పాత్ర పోషించాలని తహతహలాడుతున్నారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

తొలి మ్యాచ్‌లో విజయం సాధించినా భారత్ బౌలింగ్‌, ఫీల్డింగ్ విభాగంలో లోపాలు కనబడ్డాయి. టీమిండియా ఫీల్డర్లు 4 క్యాచ్‌లు నేలపాలు చేశారు. ఈ తప్పు మళ్లీ జరగకూడదని భారత్ భావిస్తోంది. బౌలర్‌ దీపక్‌ చాహర్​కు మరింత కచ్చితత్వం అవసరం. భువీ త్వరగా లయ అందుకోవాలి. చాహల్, వాషింగ్టన్‌ సుందర్‌ రాణించాల్సినా అవసరముంది.

విండీస్‌.. తొలి మ్యాచ్​ ఓటమిపై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. తమపై వరుసగా ఏడోసారి విజయం సాధించిన టీమిండియాపై కసితో రగిలిపోతోంది. బ్యాటింగ్​లో కరీబియన్లకు తిరుగులేకున్నా.. బౌలింగ్‌ మాత్రం బలహీనంగా ఉంది. గత మ్యాచ్​లో ఏకంగా 23 పరుగులు ఎక్స్‌ట్రాలు రూపంలో ఇచ్చారు. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముంది.

విండీస్ బ్యాట్స్​మన్ హెట్మయిర్

ABOUT THE AUTHOR

...view details