తెలంగాణ

telangana

'ద హండ్రెడ్​' లీగ్​పై బీసీసీఐ​ ఆసక్తి

By

Published : Aug 22, 2020, 7:43 PM IST

ఇంగ్లాడ్​ క్రికెట్​ బోర్డు ప్రవేశపెట్టిన 100 బంతుల టోర్నీపై భారత క్రికెట్ బోర్డు​ ఆసక్తిగా ఉన్నట్లు కొలిన్ గ్రేవ్స్ వెల్లడించారు. ఈ విషయంపై బీసీసీఐ అధికారులు తనను రోజూ అడుగుతున్నారని పేర్కొన్నాడు.

India have been regularly talking to me about Hundred
'ద హండ్రెడ్​' లీగ్​పై బీసీసీఐ​ ఆసక్తి

భారత క్రికెట్​ అధికారులు క్రమం తప్పకుండా తనను 'ద హండ్రెడ్'(100 బంతుల టోర్నీ) గురించి అడుగుతున్నారని ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు అవుట్​గోయింగ్​ ఛైర్మన్ కొలిన్​ గ్రేవ్స్​ చెప్పాడు. ఈసీబీ సరికొత్తగా ప్రవేశపెట్టిన ఈ లీగ్​​ ద్వారా క్రికెట్​పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచేందుకు ఉపయోగపడుతుందని అన్నాడు. వంద బంతుల లీగ్ ఈ ఏడాది ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా ప్రభావంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది.

"కొన్ని విదేశీ క్రికెట్​ బోర్డులు.. ముఖ్యంగా భారత్​ ఈ టోర్నీపై ఆసక్తిగా ఉంది. గతేడాది నుంచి ప్రతిరోజూ దీని గురించి నన్ను అడుగుతూనే ఉన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ లీగ్ ఎంతో ఆకట్టుకోనుందని భావిస్తున్నా"

కొలిన్ గ్రేవ్స్​, ఈసీబీ ఛైర్మెన్​

ద హండ్రెడ్ లీగ్ టోర్నీ ఫొటో

ఒకవేళ బీసీసీఐ 'ద హండ్రెడ్​' లీగ్​ను నిర్వహించాలని అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల వల్ల 2023 వరకు అది సాధ్యం కాకపోవచ్చు. కరోనా కారణంగా భవిష్యత్​ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఇలాంటి టోర్నీలు జరిపేందుకు అవకాశాలేవీ కనిపించడం లేదు. మరోవైపు మినీ ఐపీఎల్​ను ప్రవేశపెట్టే ఆలోచన భారత బోర్డు ఉన్నప్పటికీ తేదీలు కుదరకపోవడం వల్ల అమలు చేయలేకపోయింది.

ఐసీసీ ఛైర్మన్​ పదవిపై దృష్టి సారించిన గ్రేవ్స్​​.. ఈ టోర్నీని ప్రారంభించడం తనకెంతో ముఖ్యమని చెప్పాడు. తన ఐదేళ్ల పదవీ కాలంలో అతిపెద్ద సవాలు 'ద హండ్రెడ్' లీగ్​ నిర్వహణ అని పేర్కొన్నాడు. "వంద బంతుల టోర్నీ నిర్వహించడం పెద్ద సవాలని భావిస్తున్నా. మొదట అన్ని విధాలుగా సహకారం లభించింది. ప్రస్తుతం అందరూ దీని ప్రయోజనాలను గుర్తించడం ప్రారంభించారు. ఈ విషయంలో ముందుకు సాగేందుకు సరైన సమయం ఇదే. ఈసీబీకి ఆర్థికంగానూ సాయపడుతుంది" అని గ్రేవ్స్​ పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details