తెలంగాణ

telangana

By

Published : Dec 25, 2019, 5:41 PM IST

ETV Bharat / sports

అత్యంత చెత్తగా ర్యాంకింగ్స్ ఇచ్చారు: వాన్

మంగళవారం ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్​లకు సరైన ప్రదర్శన చేయనప్పటికీ మెరుగైన ర్యాంకులు ఇచ్చారని, ఆస్ట్రేలియా సత్తాచాటినా.. ఐదో ర్యాంకు ఇవ్వడమేంటని ప్రశ్నించాడు.

India and Australia best Test match teams in world: Michael Vaughan
మైఖేల్​ వాన్​

అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్​పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ విమర్శలు సంధించాడు. అత్యంత చెత్తగా ర్యాంకింగ్స్ ప్రకటించారని అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సరైన ప్రదర్శన చేయనప్పటికీ ఆ జట్లు రెండు, నాలుగు స్థానాల్లో ఉండటమేంటో అర్థం కావట్లేదని అన్నాడు.

"ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్​పై నిజాయితీగా మాట్లాడలనుకుంటున్నా. అత్యంత చెత్తగా ర్యాంకింగ్స్​ను ఇచ్చారు. గత రెండేళ్లుగా టెస్టుల్లో న్యూజిలాండ్ ఏ మేరకు రాణించిందో నాకు అర్థం కావట్లేదు. మొన్నటివరకు ఇంగ్లాండ్ మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు నాలుగో ర్యాంకుకు దిగజారింది. మూడేళ్లుగా ఇంగ్లీష్ జట్టు.. టెస్టుల్లో ఇబ్బంది ఎదుర్కొంటోంది. ముఖ్యంగా విదేశాల్లో ఆ జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. స్వదేశంలో ఒకే ఒక్క సిరీస్ నెగ్గింది. యాషెస్​ సిరీస్​లోనూ డ్రాతో సరిపెట్టుకుంది. ఐర్లాండ్​ లాంటి చిన్న జట్టుపైనే వారు గెలిచారు" -మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్​

ఈ ర్యాంకింగ్స్​ ప్రకటించడం చూసి తనకు అయోమయంగా అనిపించిందని అన్నాడు వాన్

"నా అభిప్రాయం ప్రకారం న్యూజిలాండ్​ రెండో స్థానంలో ఉండే అంత పటిష్ఠ జట్టు కాదు. ఆస్ట్రేలియా ఆ స్థానానికి తగిన జట్టు. ఈ ర్యాంకింగ్స్​ ఇవ్వడం చూసి నాకు అయోమయంగా అనిపించింది." - మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

ప్రస్తుతం టెస్టుల్లో భారత్​, ఆస్ట్రేలియానే అత్యుత్తమ జట్లని కితాబిచ్చాడు వాన్.

"సుదీర్ఘ ఫార్మాట్​లో భారత్, ఆస్ట్రేలియా.. అత్యుత్తమ జట్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆసీస్​ను ఓడించగల సత్తా ఉన్న ఏకైక జట్టు టీమిండియానే. ఏడాది క్రితం ఆసీస్ ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవం. ప్రస్తుతం ఐదో ర్యాంకులో ఉంది. స్మిత్, వార్నర్, లబుషేన్​ లాంటి స్టార్లు లేనప్పుడు వారు ఆ ర్యాంకులో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది." -మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

దక్షిణాఫ్రికా - ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ గురువారం నుంచి మొదలుకానుంది. సెంచూరియన్ వేదిక.

ఇదీ చదవండి: 'ఆస్ట్రేలియా ఓపెన్' ప్రైజ్​మనీ భారీగా పెరిగిందోచ్

ABOUT THE AUTHOR

...view details