భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్నెస్ సాధించాడు. ఇటీవలే జరిగిన ఫిట్నెస్ పరీక్షల్లో విఫలమై, జట్టులో చోటు కోల్పోయిన ఇతడు.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. నేటి నుంచి ప్రారంభమైన డీవై పాటిల్ టీ20 టోర్నీలో పాల్గొనున్నాడు. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ పాటిల్ చెప్పారు.
ఫిట్నెస్ సాధించిన హార్దిక్.. మళ్లీ మైదానంలోకి - హార్దిక్ పాండ్య గాయం
స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.. మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. దేశవాళీ లీగ్ డీవై పాటిల్ టీ20 టోర్నీలో పాల్గొనున్నాడు.

ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య
లండన్లో ఐదు నెలల క్రితం వెన్ను గాయానికి సర్జరీ చేసుకున్నాడు హార్దిక్. ఆ తర్వాత నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న కివీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నా, ఫిట్నెస్ లేని కారణంగా చోటు దక్కించుకోలేకపోయాడు.
డీవై పాటిలో టోర్నీలో భారత్కు చెందిన మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, సంజూ శాంసన్, దినేశ్ కార్తిక్.. దేశవాళీ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, దివ్యాన్ష్ సక్సేనా, మన్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి తదితరులు ఆడుతున్నారు. ఫైనల్ మార్చి 6న జరగనుంది.
Last Updated : Mar 2, 2020, 10:24 AM IST