దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలివన్డే ఘోర పరాజయం తర్వాత.. భారత మహిళల జట్టు పుంజుకుంది. లఖ్నవూ వేదికగా మంగళవారం జరిగిన రెండో వన్డే 9 వికెట్ల తేడాతో మిథాలీసేన ప్రత్యర్థిపై గెలుపొందింది. సౌతాఫ్రికా టీమ్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా కేవలం 28.4 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది.
టీమ్ఇండియా బ్యాట్స్వుమెన్ స్మృతి మంధాన (80), పూనమ్ రౌత్ (60) చెరో అర్ధశతకంతో చెలరేగి.. జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకంగా వ్యవహరించారు.