న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం జరగనున్న తొలి టెస్టులో.. కివీస్-భారత్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే టీ20లను భారత్, వన్డే సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేశాయి. ఈ నేపథ్యంలో సుధీర్ఘ ఫార్మాట్లో ఎవరు సత్తా చాటుతారనేది ఆసక్తికరంగా మారింది. భారత కాలమానం ప్రకారం రేపు(శుక్రవారం) తెల్లవారుజామున 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
టెస్టు సిరీస్ను కైవసం చేసుకుని పర్యటనను విజయవంతంగా ముగించాలని కోహ్లీసేన భావిస్తోంది. బ్యాటింగ్లో పటిష్టంగా ఉన్న భారత్... న్యూజిలాండ్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. అయితే కోహ్లీసేన కొద్దిగ స్వింగ్కు తడబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బౌల్ట్, సౌథీ వంటి పేసర్లను ఎదుర్కోవడం... బ్యాట్స్మెన్కు సవాల్గా మారనుంది.
మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్లో సెంచరీ చేసిన తెలుగబ్బాయి విహారీ ఆరో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. ప్రాక్టీస్లో పంత్ అర్ధశతకంతో రాణించినా.. సాహా తుది జట్టులో చోటు సంపాదించుకోనున్నాడు.