తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెరిసిన వేడ్, స్మిత్.. భారత్ లక్ష్యం 195 - భారత్-ఆస్ట్రేలియా టీ20 జట్లు

టీమ్​ఇండియాతో జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ వేడ్ (58) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

IND vs AUS T20
మెరిసిన వేడ్.. భారత్ లక్ష్యం 195

By

Published : Dec 6, 2020, 3:19 PM IST

Updated : Dec 6, 2020, 3:31 PM IST

టీమ్ఇండియాతో జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్​గా వచ్చిన కెప్టెన్ వేడ్ 32 బంతుల్లో 58 పరుగులతో దూకుడుగా ఆడి శుభారంభాన్ని అందించాడు. తర్వాత ఇతడు నాటకీయ రీతిలో ఔటయ్యాడు. మరో ఓపెనర్ షార్ట్ విఫలమైనా.. స్మిత్ 46 పరుగులతో రాణించాడు. తర్వాత మ్యాక్స్​వెల్ (22), హెన్రిక్స్ (26), స్టోయినిస్ (16) దూకుడుగా ఆడటం వల్ల ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

టీమ్ఇండియా బౌలర్లలో నటరాజన్ 2, శార్దూల్ ఠాకూర్, చాహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

Last Updated : Dec 6, 2020, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details