తెలంగాణ

telangana

ETV Bharat / sports

బెంగళూరులో కోహ్లీ-రోహిత్ రికార్డులే రికార్డులు

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో పలు రికార్డులు నమోదయ్యాయి. వాటిలో కోహ్లీ-రోహిత్​కు సంబంధించినవే ఎక్కువగా ఉండటం విశేషం.

By

Published : Jan 20, 2020, 10:26 AM IST

బెంగళూరులో కోహ్లీ-రోహిత్ రికార్డులే రికార్డులు
కోహ్లీ-రోహిత్

బెంగళూరులో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. స్టీవ్‌ స్మిత్‌ (131) శతకం చేయడం వల్ల తొలుత ఆసీస్‌ 286 పరుగులు చేసింది. షమి (4/63) రాణించాడు. ఛేదనలో భారత్‌.. రోహిత్‌శర్మ (119), విరాట్‌ కోహ్లీ (89) చెలరేగడం వల్ల 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. హిట్‌మ్యాన్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'‌, కోహ్లీ 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డులు దక్కించుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌తో పలు రికార్డులు నమోదయ్యాయి.

  1. అన్నిఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన భారత సారథిగా విరాట్ కోహ్లీ (11,208) రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ధోనీ (11,207) పేరిట ఉండేది. అయితే ధోనీ 330 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా.. కోహ్లీ 199 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత అందుకున్నాడు.
  2. ధోనీ పేరిట ఉన్న మరో రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు పూర్తిచేసిన భారత సారథిగా రికార్డు సృష్టించాడు. ధోనీ 127 ఇన్నింగ్స్‌ల్లో 5వేల పరుగుల మైలురాయి అందుకోగా రికార్డుల రారాజు 82 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు.
    కెప్టెన్​గా కోహ్లీ 5 వేల పరుగులు
  3. వన్డేల్లో అత్యధిక 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'లు దక్కించుకున్న జాబితాలో కోహ్లీ (8) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. గేల్‌, షాన్‌ పొలాక్‌ సరసన కోహ్లీ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (14), జయసూర్య (11) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
  4. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్‌గా రోహిత్‌శర్మ (29) రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో సచిన్‌ తెందూల్కర్ (49), కోహ్లీ (43), రికీ పాంటింగ్ (30) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అయిదో స్థానంలో సనత్‌ జయసూర్య (28) ఉన్నాడు.
  5. వన్డేల్లో అత్యంత వేగంగా తొమ్మిది వేల పరుగుల మైలురాయిని సాధించిన మూడో క్రికెటర్‌గా హిట్‌మ్యాన్‌ (217) నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లీ (194), డివిలియర్స్‌ (208) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రోహిత్‌ తర్వాతి స్థానాల్లో గంగూలీ (228), సచిన్ (235), లారా (239) ఉన్నారు.
    వన్డేల్లో రోహిత్ శర్మ 9000 పరుగులు పూర్తి
  6. వన్డేల్లో అత్యధిక శతక భాగస్వామ్యాలు సాధించిన మూడో జోడీగా రోహిత్‌-కోహ్లీ (18) నిలిచారు. ఈ జాబితాలో సచిన్‌-గంగూలీ (26), దిల్షాన్‌-సంగక్కర (20) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
  7. గత ఏడాది జనవరి నుంచి డెత్‌ ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా షమి (19) రికార్డు నెలకొల్పాడు. ముస్తాఫిజుర్ (22) తొలి స్థానంలో ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details