తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బ్రాడ్​ను​ వదిలేయడమే ఇంగ్లాండ్​ చేసిన తప్పు'

వెస్టిండీస్​తో పోరులో స్టువర్ట్​ బ్రాడ్​ను ఎంపిక చేయకపోవడమే ఇంగ్లాండ్ చేసిన తప్పని జట్టు మాజీ కెప్టెన్ నాసర్​ హుస్సేన్​ అభిప్రాయపడ్డాడు. ​ ఈ క్రమంలోనే తొలి టెస్టులో విండీస్​ ఆటతీరును ప్రశంసించాడు హుస్సేన్​.

By

Published : Jul 13, 2020, 3:50 PM IST

Nasser Hussain
బ్రాడ్​

వెస్టిండీస్​తో జరిగిన తొలి టెస్టులో వెటరన్​ పేసర్​ స్టువర్ట్​ బ్రాడ్​ను ​ఎంపిక చేయకుండా ఆతిథ్య జట్టు తప్పు చేసిందని ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ నాసర్​ హుస్సేన్​ అభిప్రాయపడ్డాడు. కరోనాతో 6 నెలలకు పైగా నిలిచిపోయిన క్రికెట్​.. వెస్టిండీస్​, ఇంగ్లాండ్​ తొలి టెస్టుతో ప్రారంభమైంది.

ఇందులో మొదటి మ్యాచ్​లో విండీస్​ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది.​ ఈ నేపథ్యంలోనే స్పందించిన హుస్సేన్​.. వెస్టిండీస్​ జట్టు ఆటతీరును ప్రశంసించాడు.

నాసర్​ హుస్సేన్​

"అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు వెస్డిండీస్​ జట్టుకు హ్యాట్స్​ఆఫ్​. అయితే, నేను ఇంగ్లాండ్​ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఇది యాషెస్​ మ్యాచ్​ అయ్యుంటే.. బ్రాడ్​ను వదిలేసేవారా? వెస్టిండీస్​ జట్టుకు తక్కువ అంచనా వేసి ఇలా పొరపాటు చేశారా? అని ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ బ్రాడ్​ జట్టులో ఉంటే.. స్టోక్స్​ బుధవారం జరిగిన మ్యాచ్​లో బౌలింగ్​ ఎంచుకునే వాడు.. అప్పుడు కచ్చితంగా వెస్డిండీస్​ పరాజయం పొంది ఉండేదని నా నమ్మకం."

నాసర్​ హుస్సేన్​, ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​

జాసన్​ హోల్డర్​ జట్టు విస్డెన్​ ట్రోఫీ కైవసం దిశగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలోనూ ఇంగ్లీష్​ జట్టును ఓడించి ట్రోఫీ సొంతం చేసుకుంది వెస్టిండీస్​. మాంచెస్టర్​లోని ఓల్డ్​ ట్రాఫోర్డ్​లో జరగనున్న రెండో టెస్టులో గురువారం ఇరు జట్లు తలపడనున్నాయి.

ఇదీ చూడండి:'ప్లాన్​ బీ లేకపోవడమే టీమ్​ఇండియాకు శాపం!'

ABOUT THE AUTHOR

...view details