తెలంగాణ

telangana

By

Published : Mar 24, 2021, 3:59 PM IST

Updated : Mar 24, 2021, 5:11 PM IST

ETV Bharat / sports

క్రికెట్​లో యథాతథంగా 'అంపైర్స్​ కాల్​' విధానం!

డీఆర్​ఎస్​ విధానంలో భాగంగా క్రికెట్​లో 'అంపైర్స్​ కాల్'​ నిబంధన ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. సాంకేతికత సాయంతో తనిఖీ చేసే బాల్​ ట్రాకింగ్ విధానం 100 శాతం సరైనదని చెప్పలేమంది.

ICC's Cricket Committee says concept of 'umpire's call' rule should stay
క్రికెట్​లో 'అంపైర్స్​ కాల్​' విధానం ఉంటుంది: ఐసీసీ

నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్​ఎస్​)పై ఇటీవల వస్తున్న విమర్శలపై ఐసీసీ స్పందించింది. బాల్​ ట్రాకింగ్​ విధానం 100 శాతం సరైనది కాదని పేర్కొంటూనే.. క్రికెట్​లో 'అంపైర్స్​ కాల్'​ నిబంధన తప్పనిసరి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తన సిఫార్సును వచ్చే వారం సమావేశం కానున్న పాలకమండలి ముందు ఉంచనుంది ఐసీసీ. మార్చి 30న జరగబోయే త్రైమాసిక సమావేశానికి ముందు ఈ విషయం చర్చకు వస్తుందని వెల్లడించింది. దీంతో పాటు ఐసీసీ సీఈఓ మనూ సాహ్నీ భవితవ్యంపైనా చర్చించే అవకాశం ఉందని తెలిపింది.

ఈ పాలక మండలి అధ్యక్షుడిగా భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఉన్నాడు. సభ్యులుగా ఆయా దేశాల మాజీ క్రికెటర్లు ఆండ్రూ స్ట్రాస్, రాహుల్ ద్రవిడ్​, మహేల జయవర్ధనే, షాన్ పొలాక్​తో పాటు మ్యాచ్​ రిఫరీ రంజన్ మదుగాల్లె, అంపైర్ రిచర్డ్​ ఇల్లింగ్​వర్త్​, మికీ ఆర్తర్ ఉన్నారు. వీరు మ్యాచ్​ అధికారులు, ప్రసార దారులు, బాల్ ట్రాకింగ్ సరఫరాదారు అయిన హాక్ ఐ నుంచి సలహాలు తీసుకున్నారు.

క్రికెట్​లో డీఆర్​ఎస్ విధానం మొదలైనప్పటి నుంచి​ అంపైర్స్​ కాల్ అంశం చర్చనీయాంశంగా మారింది. చాలా మంది మాజీ ఆటగాళ్లు ఈ విధానాన్ని తొలగించాలని కోరారు. ఇటీవలే అంపైర్​ నితిన్ మేనన్​తో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో కోహ్లీ టాప్- టీ20ల్లో ఫోర్త్

Last Updated : Mar 24, 2021, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details