తెలంగాణ

telangana

ETV Bharat / sports

మరోసారి టీమిండియా ఆటగాళ్ల ఫీజులో కోత - టీమిండియా ఆటగాళ్ల ఫీజులో కోత

న్యూజిలాండ్​తో జరిగిన ఐదో టీ20లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా విధించింది ఐసీసీ. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధించింది.

టీమిండియా
టీమిండియా

By

Published : Feb 3, 2020, 5:00 PM IST

Updated : Feb 29, 2020, 12:48 AM IST

న్యూజిలాండ్​​తో జరిగిన ఐదు టీ20ల సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసింది టీమిండియా. అయితే చివరి మ్యాచ్​ అనంతరం బారత్​కు మరోసారి షాక్ ఇచ్చింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. మౌంట్ మాంగనుయ్​ వేదికగా జరిగిన ఐదో టీ20లో స్లో ఓవర్​ రేట్ కారణంగా భారత్​కు జరిమానా విధించింది. ఆటగాళ్ల ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే కారణంతో నాలుగో టీ20లోనూ 40 శాతం కోత ఎదుర్కొన్నారు భారత క్రికెటర్లు.

"భారత జట్టు నిర్దేశిత సమయంలో 20 ఓవర్లు వేయాల్సి ఉండగా ఒక ఓవర్ ఆలస్యంగా వేసింది. అందుకే ఆటగాళ్ల ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నాం. ఈ మ్యాచ్​కు సారథిగా ఉన్న రోహిత్ శర్మ తన పొరపాటును అంగీకరించడం వల్ల ఎలాంటి విచారణ ఉండదు"
-ఐసీసీ ప్రకటన

కివీస్​తో జరిగిన టీ20 సిరీస్​ను 5-0 తేడాతో వైట్​వాష్ చేసింది భారత్. సమష్టిగా రాణించిన కోహ్లీసేన.. వన్డే, టెస్టు సిరీస్​కు సిద్ధమవుతోంది. తొలి వన్డే హామిల్టన్​లో ఈ బుధవారం జరగనుంది.

ఇవీ చూడండి.. కివీస్​తో వన్డే, టెస్టు సిరీస్​కు రోహిత్ దూరం

Last Updated : Feb 29, 2020, 12:48 AM IST

ABOUT THE AUTHOR

...view details