తెలంగాణ

telangana

By

Published : Mar 19, 2019, 6:49 AM IST

Updated : Mar 19, 2019, 8:32 PM IST

ETV Bharat / sports

'భద్రత విషయంలో రాజీ పడేది లేదు'

న్యూజిలాండ్​ మసీదు కాల్పుల ఘటన కారణంగా ప్రపంచకప్​లో పాల్గొనే క్రికెటర్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. దాడిలో బంగ్లాదేశ్​ క్రికెటర్లు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ అనుమానాలపై  ఐసీసీ సీఈవో డేవ్​ రిచర్డ్​సన్​ స్పందిస్తూ...​ క్రీడాకారులు, అభిమానుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.

'భద్రత విషయంలో రాజీ లేదు': ఐసీసీ సీఈవో

'భద్రతవిషయంలో రాజీ పడేది లేదు'

క్రైస్ట్​చర్చ్​ ఘటన అనంతరం ప్రపంచకప్​లో పాల్గొనే ఆటగాళ్లు, వీక్షించేందుకు వచ్చే ప్రజల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. న్యూజిలాండ్‌లోని ఇక్కడి మసీదుల్లో జరిగిన ఉగ్రదాడిలో 50 మంది పౌరులు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనలో బంగ్లాదేశ్‌ క్రికెటర్లు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అనంతరం కివీస్‌తో టెస్ట్‌ను రద్దుచేసుకొని స్వదేశానికి వెళ్లిపోయారు. ఈ మ్యాచ్‌ రద్దుకు ఐసీసీ సైతం ఆమోదం తెలిపింది.

  • ఆదివారం కరాచీలో జరిగిన పాకిస్థాన్​ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌) ఫైనల్​కు హాజరయ్యారు ఐసీసీ సీఈవో రిచర్డ్​సన్​. అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన వన్డే ప్రపంచకప్‌లో ఆటగాళ్లు, అభిమానుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు.
    మీడియా సమావేశంలో ఐసీసీ సీఈవో రిచర్డ్సన్​

‘న్యూజిలాండ్​ ఘటన బాధాకరం. కానీ ప్రపంచకప్​ లాంటి పెద్ద ఈవెంట్​సెక్యూరిటీ విషయంలో ఐసీసీ చాలా జాగ్రత్త వహిస్తోంది. వరల్డ్‌కప్‌ జరగనున్న వేదికల్లో భద్రతపై ఇప్పటికే యూకే, వేల్స్‌ క్రికెట్‌ బోర్డులు ఆ దేశ భద్రతా వ్యవస్థలతో చర్యలు ప్రారంభించారు. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన దాడి తర్వాత రక్షణ ఏర్పాట్లను మరింత పకడ్బందీగా మారుస్తున్నారు’

-ఐసీసీ సీఈవో, రిచర్డ్​సన్​

Last Updated : Mar 19, 2019, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details