రెండో టీ20లో టీమ్ఇండియా తమ బలహీనతలను బయట పెట్టిందని ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ అన్నాడు. నెమ్మది పిచ్లపై ఇబ్బంది పడే తమ బలహీనతను కోహ్లీసేన సొమ్ము చేసుకుందని పేర్కొన్నాడు. కానీ ప్రపంచకప్కు సన్నద్ధమయ్యేందుకు తమ ముందున్న ఏకైక దారి ఇదేనని వెల్లడించాడు. మ్యాచులో ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు.
"ప్రస్తుత పిచ్కు మా ఆటతీరుకు మధ్య వ్యత్యాసం ఉంది. తొలి మ్యాచ్కు ఉపయోగించిన పిచ్లో మంచి వేగం ఉంది. ఇప్పటి వికెట్ మందకొడిగా ఉంది. అది మా బలహీనతను బయటపెట్టింది. మేం ఎక్కువగా నెమ్మది పిచ్లపై ఆడలేడు. వాటిపై ఎంత ఎక్కువగా ఆడితే అంతగా మెరుగవుతాం. పొరపాట్లు చేస్తూ వీటిపై ఎక్కువగా ఆడితేనే నెమ్మది పరిస్థితులను అధిగమించగలం."