తెలంగాణ

telangana

ETV Bharat / sports

విమర్శలు నన్నేం చేయలేవు: రహానే - India's Test vice-captain Ajinkya Rahane

విండీస్​తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా​ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు వైస్​ కెప్టెన్​ అజింక్యా రహానే. రెండు ఇన్నింగ్స్​ల్లోనూ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అయితే మ్యాచ్​ గెలిచిన అనంతరం మాట్లాడిన రహానే.. తనపై వచ్చిన విమర్శల గురించి ప్రస్తావించాడు.

అజింక్యా రహానే

By

Published : Aug 28, 2019, 11:35 AM IST

Updated : Sep 28, 2019, 2:08 PM IST

ఆంటిగ్వాలోని రిచర్డ్స్​ స్టేడియం వేదికగా వెస్టిండీస్​తో జరిగిన తొలి టెస్టులో... భారత్ 318 పరుగుల తేడాతో ఘన​ విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో రెండో ఇన్నింగ్స్​ల్లో 81, 102 పరుగులతో ఆకట్టుకున్నాడు ​రహానే. గెలుపు అనంతరం మాట్లాడిన టెస్టు వైస్​ కెప్టెన్​... తనపై విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.

"విమర్శలు సాధారణం. వాటిని ఆపటం సాధ్యం కాదు. అయితే వాటిని పట్టించుకోకుండా ఆడేందుకు ప్రయత్నిస్తా. సెంచరీ చేసినపుడు మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను సాధించాల్సింది చాలా ఉంది. శతకం కన్నా జట్టును మంచి స్థితిలో ఉంచటమే ముఖ్యం".
-- రహానే, క్రికెటర్​

ఈ మధ్య కాలంలో రహానే సరైన ఆట కనబరచకపోయినా టీమిండియా యాజమాన్యం అతడ్ని టెస్టులకు ఎంపిక చేయటంపై పెద్ద చర్చ జరిగింది. అయితే అలాంటి సమయంలో టీమిండియా కెప్టెన్​ కోహ్లీ నిరంతరం మద్ధతుగా నిలిచాడని చెప్పాడు రహానే. ఈ ప్రదర్శనతో విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చానని అభిప్రాయపడ్డాడు.

వెస్టిండీస్​తో రెండో టెస్టు మ్యాచ్​ జమైకా వేదికగా ఆగస్టు 30న జరగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో టీమిండియా ప్రస్తుతం పరుగుల పట్టికలో మెుదటి స్థానంలో ఉంది.

ఇదీ చూడండి: ఒలింపిక్స్​ స్వర్ణమే నా టార్గెట్​: సింధు

Last Updated : Sep 28, 2019, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details