తెలంగాణ

telangana

By

Published : Jul 23, 2019, 10:18 AM IST

Updated : Jul 23, 2019, 4:50 PM IST

ETV Bharat / sports

తొలిసారి రాజస్థాన్ నుంచి ముగ్గురు

ఆగస్టు 3నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్ పర్యటనకు జట్టును ప్రకటించింది టీమిండియా సెలక్షన్ కమిటీ. ఈ జట్టులో తొలిసారి రాజస్థాన్​ నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.

క్రికెట్

వచ్చే నెలలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్​కు ఆదివారం జట్టును ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. యువ ఆటగాళ్లకూ అవకాశం కల్పించింది. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతోన్న మిడిలార్డర్ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నారు సెలక్టర్లు. అందుకోసం మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, పంత్​లకు చోటు కల్పించారు. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే తొలిసారిగా భారత జట్టులో ముగ్గురు రాజస్థాన్ ఆటగాళ్లకు అవకాశం లభించింది.

రాజస్థాన్ నుంచి ముగ్గురు

వెస్టిండీస్​తో జరిగే టీ20 సిరీస్​ కోసం ఎక్కువగా యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపారు సెలక్టర్లు. దేశవాళీ, ఐపీఎల్‌లో చక్కటి ప్రదర్శన చేసిన క్రికెటర్లకు అవకాశం కల్పించారు. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టీమిండియాకు ఎంపికయ్యారు. దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్ క్రికెట్ ఆసోసియేషన్(ఆర్‌సీఏ)కు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఖలీల్ అహ్మద్, దీపర్ చాహర్, రాహుల్ చాహల్‌లు చోటు దక్కించుకున్నారు.

తాజాగా జరిగిన ప్రపంచకప్​ తుది జట్టులో చోటు దక్కకపోయినా.. స్టాండ్​బై ప్లేయర్​గా ఇంగ్లాండ్ వెళ్లాడు ఖలీల్ అహ్మద్. నెట్ బౌలర్‌గా సేవలను అందించాడు. 2018లో దీపక్ చాహర్ టీ20 అరంగేట్రం చేశాడు. ఈసారి తన సోదరుడు, లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహార్‌ విండీస్​లో జరగనున్న టీ20 సిరీస్​కు ఎంపికయ్యాడు.

విండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. తొలి రెండు టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనుండగా మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ వెస్టిండీస్ వేదికకానుంది.

ఇవీ చూడండి.. అత్యుత్తమ క్రికెట్​ జట్టు సిద్ధం చేస్తున్న ప్రధాని!

Last Updated : Jul 23, 2019, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details