తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధర్మశాలలో టీ20 మ్యాచ్​కు ముందు భారీ వర్షం

ధర్మశాల వేదికగా భారత్​-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్​కు వరుణుడు అడ్డంకిగా మారనున్నాడు. ప్రస్తుతం అక్కడ భారీ వర్షం కురుస్తోంది. మ్యాచ్ రాత్రి​ 7 గంటలకు ప్రారంభంకానుంది

By

Published : Sep 15, 2019, 2:53 PM IST

Updated : Sep 30, 2019, 5:08 PM IST

ధర్మశాలలో టీ20 మ్యాచ్​కు ముందు భారీ వర్షం

టీమిండియా, సఫారీ జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్​కు వరుణుడు ముప్పుగా మారాడు. హిమాచల్​ప్రదేశ్​లోని​ ధర్మశాలలో జోరుగా వర్షం కురుస్తోంది. సాయంత్రం 5 గంటలలోపు వాన ఆగుతుందని అధికారులు భావిస్తున్నారు. హెచ్​పీసీఏ(హిమాచల్​ ప్రదేశ్​ క్రికెట్​ అసోసియేషన్)స్టేడియంలో మెరుగైన డ్రైనేజ్​ సదుపాయాలు ఉన్నాయి. వాన తెరిపినిస్తే మ్యాచ్​ కోసం మైదానాన్ని వెంటనే సిద్ధం చేయగలమని క్యురేటర్​ చెప్పారు. ఆట రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది. చివరి అవకాశంగా జట్టుకు ఐదు ఓవర్ల చొప్పున మ్యాచ్​ను ఆడించే వీలుంది.

ధర్మశాలలో భారీ వర్షం

భారత జట్టు:

విరాట్​ కోహ్లీ (కెప్టెన్​), రోహిత్​ శర్మ (వైస్​ కెప్టెన్​), ధావన్​, కేఎల్​ రాహుల్​, శ్రేయాస్​ అయ్యర్​, మనీష్​ పాండే, రిషభ్ పంత్​ (కీపర్​), హార్దిక్​ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్​ పాండ్య, వాషింగ్టన్​ సుందర్​, రాహుల్​ చాహర్​, ఖలీల్​ అహ్మద్​, దీపక్​ చాహర్​, నవదీప్​ సైనీ.

దక్షిణాఫ్రికా జట్టు:

క్వింటన్​ డికాక్ ​(సారథి), డసెన్ ​(ఉప సారథి), తంబే బవుమా, జూనియర్​ డాలా, ఫార్చ్యూన్​, బ్యూరెన్​ హెండ్రిక్స్​, రీజా హెండ్రిక్స్​, డేవిడ్​ మిల్లర్​, ఆన్రిచ్ నోర్టజే, ఫెలుక్వాయో, ప్రిటోరియస్​, రబాడ, తబ్రేజ్​ షంశీ, జార్డ్​ లిండే

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details