తెలంగాణ

telangana

By

Published : Jul 31, 2019, 6:07 PM IST

ETV Bharat / sports

ప్రభుత్వం అలసత్వం.. హర్భజన్​కు 'ఖేల్​రత్న' మిస్

ఈ ఏడాది ఖేల్​రత్న అవార్డు నామినేషన్లకు పత్రాలు ఆలస్యంగా చేరిన కారణంగా మాజీ క్రికెటర్ హర్భజన్​ సింగ్​ పేరు తిరస్కరణకు గురైంది. ఈ విషయంపై స్పందించిన పంజాబ్​ ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని అధికారులను ఆదేశించింది.

ఖేల్​రత్న అవార్డు కోసం పత్రాలు పంపిన విషయంపై స్పందించిన క్రికెటర్ హర్భజన్ సింగ్

ఖేల్​రత్న అవార్డు నామినేషన్స్​కు కావాల్సిన పత్రాలు ఆలస్యంగా చేరిన కారణంగా​ క్రికెటర్​ హర్భజన్ సింగ్​ దాఖలు చేసిన అప్లికేషన్​ను ఈ ఏడాది తిరస్కరించారు. తను సరైన సమయంలోనే పత్రాలు సమర్పించినా..రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించిందని చెప్పాడు భజ్జీ. ఈ విషయంపై స్పందించిన పంజాబ్​ గవర్నమెంట్​ తక్షణ దర్యాప్తునకు ఆదేశించింది. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని అధికారులను కోరింది.

ఈ విషయం ఎవరి పొరపాటు వల్ల జరిగిందో తెలపాలని పంజాబ్ క్రీడా శాఖ మంత్రి రానా గుర్మీత్​ సింగ్​ను కోరాడు హర్భజన్. ట్విట్టర్​లో ఓ వీడియోను పోస్ట్​ చేశాడీ మాజీ క్రికెటర్.

మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్

"పంజాబ్​ ప్రభుత్వానికి నా ఖేల్ రత్న అవార్డుకు సంబంధించిన పత్రాలు మార్చి 20వ తేదీనే పంపాను. అక్కడి నుంచి 10-15 రోజుల్లో దిల్లీ చేరుకోవాలి. కానీ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖకు పంపడంలో పంజాబ్​ గవర్నమెంట్ ఆలస్యం చేసింది. ఈ కారణంగా ఈ ఏడాది నామినేషన్స్​కు దూరమయ్యాను." -హర్భజన్ సింగ్, మాజీ క్రికెటర్

టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన వారిలో మూడో స్థానంలో ఉన్నాడు హర్భజన్ సింగ్. ఖేల్ రత్న అవార్డు కోసం తన అప్లికేషన్​ను వచ్చే ఏడాది మళ్లీ పంపాలని ప్రభుత్వాన్ని కోరాడు.

ఇది చదవండి: ద్యుతీ చంద్​, హర్భజన్​ నామినేషన్ల తిరస్కరణ

ABOUT THE AUTHOR

...view details