ఐపీఎల్ తొలి సీజన్లో భారత క్రికెటర్లు హర్భజన్, శ్రీశాంత్ల మధ్య జరిగిన గొడవను అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. ముంబయి-పంజాబ్ మధ్య లీగ్ మ్యాచ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే శ్రీశాంత్ను చెంపదెబ్బ కొట్టిన తర్వాత భజ్జీ చాలా బాధపడ్డాడని చెప్పాడు ఆసీస్ క్రికెటర్ డొమినిక్ థోర్న్లే. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకున్నాడు.
"ఈ ఘటన జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అకస్మాతుగా భజ్జీ.. శ్రీశాంత్ను కొట్టడం వల్ల ఆశ్చర్యానికి గురయ్యాను. ఆ తర్వాత హర్భజన్ ఔటై వచ్చి, డగౌట్లో నా పక్కనే కూర్చొన్నాడు. అప్పుడు అతడేం మాట్లడలేదు. అనంతరం హోటల్కు వచ్చిన హర్భజన్.. తాను అలా చేసుండకూడదని బాధపడ్డాడు"
-డొమినిక్, ఆసీస్ క్రికెటర్