తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండు సార్లు సెమీస్​లో ఓడాం.. ఈ సారి ప్రపంచకప్​ పక్కా! - Harmanpreet

మైదానంలో ఒత్తిడిని అధిగమించటం చాలా కీలకమని తెలిపింది భారత మహిళా క్రికెట్​ జట్టు సారథి​ హర్మన్​ ప్రీత్​కౌర్​. రాబోయే టీ20 ప్రపంచకప్​లో ఆటను ఆస్వాదిస్తూ విజయాన్ని అందుకుంటామని ధీమా వ్యక్తం చేసింది.

Handling pressure will be key in upcoming T20 World Cup: Harmanpreet
ఒత్తిడిని జయించటం అసలైన సవాలు: హర్మన్​ప్రీత్​

By

Published : Jan 23, 2020, 8:02 PM IST

Updated : Feb 18, 2020, 3:54 AM IST

ఆటల్లో కొన్నిసార్లు ఒత్తిడిని అధిగమించటం చాలా కీలకమని భారత మహిళా క్రికెట్​ జట్టు కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ అభిప్రాయపడింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే మహిళల టీ20 ప్రపంచకప్​కు మానసికంగా సన్నద్ధమవుతున్నట్లు తెలిపింది.

"చివరి రెండు టీ20 ప్రపంచకప్​ల్లో సెమీఫైనల్​ వరకు వెళ్లి ఓడిపోయాం. ఒత్తిడిని ఎదుర్కోవడమే అసలైన సవాలుగా మారింది. దీని వల్ల గతంలో పరాజయం పాలయ్యాం. ఈ సారి కచ్చితంగా ఆ పరిస్థితులను అధిగమిస్తాం. ఆటను ఆస్వాదిస్తూ మైదానంలో మెరుగైన ప్రదర్శన చేస్తాం".
- హర్మన్​ప్రీత్​ కౌర్​, భారత మహిళా క్రికెట్​ జట్టు కెప్టెన్​

ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నారు.ఫైనల్​ మ్యాచ్​ మహిళా దినోత్సవం రోజున మెల్‌బోర్న్ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ)లో జరగనుంది. మొత్తం 10 జట్లు ఈ ప్రపంచకప్‌లో పాల్గొననున్నాయి.

ఇదీ చూడండి.. కోల్​కతాకు శుభ్​మన్​ను కెప్టెన్ చేయండి..!
Last Updated : Feb 18, 2020, 3:54 AM IST

ABOUT THE AUTHOR

...view details