లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ క్రీడలకు చెప్పుకోదగ్గ కేటాయింపులు లేకుండానే సాగింది. 2021-22 ఏడాదికిగానూ క్రీడల కోసం రూ.2,596.14 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.గతేడాదితో పోల్చుకుంటే రూ.230.78కోట్లు(8.16శాతం) తక్కువగా కేటాయించారు.
క్రీడా బడ్జెట్: గతేడాదితో పోలిస్తే రూ.230 కోట్లు కోత - కేంద్ర బడ్జెట్ స్పోర్ట్స్ 2021-22
2021-22 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా క్రీడలకు సంబంధించి గతేడాదితో పోలిస్తే రూ.230.78కోట్లు తగ్గించి రూ.2,596.14 కోట్లు కేటాయించారు.

బడ్జెట్
స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్)కు గతేడాది కన్నా రూ.160కోట్లు పెంచి రూ.660.41కోట్లు కేటాయించారు. అయితే ఖేలో ఇండియాకు మాత్రం 232.71కోట్లు తగ్గించి రూ.657.71కోట్లతో సరిపెట్టారు. నేషనల్ స్పోర్ట్ ఫెడరేషన్స్కు గతేడాదితో పోలిస్తే రూ.35కోట్లు పెంచి రూ.280కోట్లు కేటాయించగా.. కామన్ వెల్త్ గేమ్స్కు రూ.33కోట్లు తగ్గించి రూ.30కోట్లు కేటాయించారు.
Last Updated : Feb 1, 2021, 9:10 PM IST