టీమ్ఇండియా మాజీ క్రికెటర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్కు కరోనా నెగటివ్గా వచ్చింది. ఇటీవల తన ఇంట్లో ఓ వ్యక్తికి కరోనా రావడం వల్ల వైద్య పరీక్షలు చేయించుకున్న గౌతీకి ఫలితాల్లో నెగిటివ్గా తేలింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు.
"కరోనా పరీక్షల్లో నాకు నెగిటివ్గా వచ్చినందుకు సంతోషంగా ఉంది. మీ అభిమానానికి ధన్యవాదాలు. అందరూ మార్గదర్శకాలను పాటించి జాగ్రత్తగా ఉండాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను"