కరోనాపై నిరంతర పోరాటం చేస్తోన్న యోధుల్లో.. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది ముందున్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు కొవిడ్-19 బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా వీరి కృషికి సంఘీభావం తెలిపారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.
ఇందుకోసం ప్రముఖ చాకెట్ల ఉత్పత్తి సంస్థ మార్స్ వ్రింగ్లీతో చేతులు కలిపారు దాదా. ఆ సంస్థ తయారు చేసిన చాక్లెట్లను పశ్చిమ బంగా వైద్య ఫోరం సభ్యులకు పంపిణీ చేసి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా యోధులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. దీంతో పాటు కోల్కతాలోని మెడికా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొవిడ్ విభాగంలో పనిచేసే వైద్యబృందానికి ఈ చాక్లెట్లను పంచారు.