తెలంగాణ

telangana

By

Published : Oct 14, 2019, 5:11 AM IST

Updated : Oct 14, 2019, 7:54 AM IST

ETV Bharat / sports

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్​ గంగూలీ!

బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్​ సౌరభ్​ గంగూలీ దాదాపు ఎంపికైనట్లే. బీసీసీఐ రాష్ట్ర ప్రతినిధుల సంఘ సభ్యులు.. ఆదివారం జరిగిన సమావేశంలో దాదావైపే మెుగ్గుచూపారు. నూతన కార్యదర్శిగా అమిత్ షా తనయడు జై షా, కోశాధికారిగా అరుణ్​ ధుమాల్​ నియమితులు కానున్నారని సమాచారం.

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్​ గంగూలీ!

భారత క్రికెట్​ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా మాజీ సారథి సౌరభ్​ గంగూలీ ఏకగ్రీవంగా ఎంపికైనట్లే. అధ్యక్ష పదవికి మాజీ ఆటగాడు బ్రిజేష్​ పటేల్​ పేరు వినిపించినప్పటికీ సౌరభ్​కే పగ్గాలు దక్కనున్నాయి.

బోర్డు కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి తనయుడు జై షా... కోశాధికారిగా అరుణ్​ ధూమల్బాధ్యతలు ​ చేపట్టనున్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్​ ఠాకూర్​ సోదరుడే ధూమల్​.

నామినేషన్లు దాఖలు చేయడానికి సోమవారమే ఆఖరి రోజు. అయితే ఈ పదవులకు ఎన్నికలు జరగడం లేదు. ఎన్నో వారాల చర్చలు, వాదోపవాదాల అనంతం అందరు ఏకాభిప్రాయానికి రావడమే ఇందుకు కారణం.

47ఏళ్ల సౌరభ్​... ప్రస్తుతం బంగాల్​ క్రికెట్​ అసోసియేషన్​(సీఏబీ) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

శ్రీనివాసన్ సన్నిహితుడైన బ్రిజేష్​కు గంగూలీకి తీవ్ర పోటీ నెలకొంది. కానీ చివరికి అధ్యక్ష పదవి దాదాకే దక్కనుంది. బ్రిజేష్​కు ఐపీఎల్​ ఛైర్మన్​ పదవి చేపట్టనున్నాడు.

ఇదీ చూడండి:-కళ్లు చెదిరే క్యాచ్​లు అందుకొన్న కోహ్లీ, సాహా..!

Last Updated : Oct 14, 2019, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details