తెలంగాణ

telangana

By

Published : Jul 13, 2020, 6:40 AM IST

ETV Bharat / sports

'గంగూలీ గొడవ పెద్దది చేయొద్దన్నాడు'

గత అనుభవాలు గుర్తుచేసుకున్న లంక మాజీ సారథి సంగక్కర.. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు. గంగూలీ.. తమను గొడవ పెద్దది చేయొద్దని కోరినట్లు వెల్లడించాడు.

sangakkara
సంగక్కర.

భారత మాజీ సారథి సౌరభ్​ గంగూలీ.. ఓ సందర్భంలో తమ డ్రెస్సింగ్​ రూమ్​కు వచ్చి మైదానంలో జరిగిన ఓ గొడవను పెద్దది చేయొద్దని కోరాడని శ్రీలంక మాజీ కెప్టెన్​ కుమార సంగక్కర చెప్పాడు. లంకతో 2002 ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​ సందర్భంగా మైదానంలో రసెల్​ ఆర్నాల్డ్​తో వాగ్వాదానికి దిగిన నేపథ్యంలో దాదా​ ఇలా చేశాడని గుర్తు చేసుకున్నాడు.

గంగూలూ

"ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్లో ఆర్నాల్డ్​తో గంగూలీ వాగ్వావాదానికి దిగాడు. అతన్ని చివరగా ఓ సారి హెచ్చరించిన అంపైర్​ ఆఖరికి రిఫరీకి ఫిర్యాదు చేశాడు. ఈ స్థితిలో దాదా మా డ్రెస్సింగ్​ రూమ్​కు వచ్చి మాట్లాడాడు. 'మీరు ఈ వివాదాన్ని కొనసాగిస్తే ఎక్కడికో వెళ్లిపోతుంది. నాపై సస్పెన్షన్​ కూడా పడొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని పెద్దది చేయద్దు' అని కోరాడు. మేం అలా చేయబోమని అతనికి చెప్పాం" అని సంగ చెప్పాడు.

మైదానంలో ప్రత్యర్థే అయినా దాదాపై సదాభిప్రాయం ఉందని ఈ లంక మాజీ వికెట్​ కీపర్​ పేర్కొన్నాడు.

"దాదాతో మాట్లాడటాన్ని అస్వాదిస్తా. మైదానంలో ఎంతవరకు ఉండాలో అతనికి తెలుసు. మైదానం బయట మాత్రం దాదా మృదు స్వభావి. మైదానంలో, బయట సౌరభ్​పై ఎంతో గౌరవం ఉంది" అని సంగ చెప్పాడు.

ఇది చూడండి : 'నేను, ధోనీ నేలపైనే నిద్రించే వాళ్లం'

ABOUT THE AUTHOR

...view details