తెలంగాణ

telangana

By

Published : Mar 18, 2019, 11:34 PM IST

Updated : Mar 19, 2019, 8:21 PM IST

ETV Bharat / sports

భారత్​-పాక్​ మ్యాచ్​పై గంభీర్​

ప్రపంచకప్​లో భారత్-పాకిస్థాన్​ మ్యాచ్​పై సందిగ్ధం కొనసాగుతోంది. ఈ విషయంపై ప్రభుత్వం, బీసీసీఐ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఈ విషయంపై మాజీ​ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ స్పందించాడు.

భారత్​-పాక్​ మ్యాచ్​పై గంభీర్​ స్పందన

ఇంగ్లండ్​లో జూన్​ 16న జరగాల్సి ఉన్న భారత్​-పాక్​ ​వరల్డ్​కప్​ మ్యాచ్​పై గౌతమ్​ గంభీర్​ స్పందించాడు. సాధారణంగా దేశంలో జరిగే ఘటనలపై ఎప్పుడూ తనదైన శైలిలో స్పందించే ఆటగాళ్లలో గంభీర్​ ఒకడు. పుల్వామా దాడిలో జవాన్ల కుటుంబాలకు మద్దతుగా నిలిచిన ఈ మాజీ ఆటగాడు...దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తానంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ప్రపంకప్​ విషయంపై మాట్లాడుతోన్న గంభీర్​

'పాకిస్థాన్​, భారత్​ మధ్య మ్యాచ్​ నిర్వహించాలా వద్దా అనేది బీసీసీఐ నిర్ణయం. నా వ్యక్తిగత ఆలోచన అయితే ఆట వదులుకోవడంలో తప్పేం లేదు. ఆ మ్యాచ్​ ద్వారా వచ్చే రెండు పాయింట్లు అంత ముఖ్యమని భావించడం లేదు. భారత క్రికెట్​కు ఈ విషయంలో ప్రజల మద్దతు అవసరం. నా దృష్టిలో క్రికెట్​ కంటే జవాన్ల త్యాగం గొప్పది. అందుకే దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తా'.

-గౌతమ్​ గంభీర్, భారత మాజీ క్రికెటర్​​

  • ఐపీఎల్​లో కామెంటర్​గా...

రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నట్లు వస్తోన్న వార్తలపైనా జవాబిచ్చాడు గంభీర్​.

ఈ విషయంలో చాలా పుకార్లు వస్తున్నాయి. నాకైతే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదు. అది నాకు సంబంధించినది కాదు. నాకు వాటిపై పెద్దగా అవగాహన లేదు. పద్మశ్రీ వచ్చినందుకు సంతోషంగా ఉంది. - గౌతమ్ గంభీర్​, భారత మాజీ క్రికెటర్​.

ప్రస్తుతం ఐపీఎల్​లో కామెంటరీ చేసేందుకు సిద్ధమవుతున్నానని వెల్లడించాడు గంభీర్​.

ఐపీఎల్​లో సంభాషణలో...

క్రికెట్​కు విరామం దొరికింది. కుటుంబంతో సమయం గడుపుతున్నా అంటూ మాట్లాడాడు భారత మాజీ ఓపెనర్​.

భార్యాపిల్లలతో గంభీర్​
Last Updated : Mar 19, 2019, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details