తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎన్నికల్లో ఓపెనింగ్​కు గౌతం గంభీర్​ సిద్ధం!

భారత క్రికట్​ జట్టు మాజీ ఓపెనర్​ గౌతమ్​ గంభీర్​ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రులు అరుణ్​జైట్లీ, రవిశంకర్​ ప్రసాద్​ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2011 ప్రపంచకప్​ హీరో దిల్లీ నుంచి లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

By

Published : Mar 22, 2019, 1:55 PM IST

Updated : Mar 22, 2019, 2:54 PM IST

భాజపా గూటికి భారత క్రికెట్​ జట్టు మాజీ ఓపెనర్​ గౌతమ్​ గంభీర్

భారత క్రికెట్​ జట్టు మాజీ ఓపెనర్​ గౌతమ్​ గంభీర్​ ప్రత్యక్ష రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్​ ప్రారంభించారు. దిల్లీలో కేంద్రమంత్రులు అరుణ్​జైట్లీ, రవిశంకర్​ ప్రసాద్​ సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

భాజపా గూటికి భారత క్రికెట్​ జట్టు మాజీ ఓపెనర్​ గౌతమ్​ గంభీర్

" దేశానికి ప్రత్యేక సేవ చేసుకునేందుకు అవకాశమిచ్చిన భాజపాకు ధన్యవాదాలు. జైట్లీ, రవిశంకర్​ ప్రసాద్​కు కృతజ్ఞతలు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. అందుకే భాజపాలో చేరాను. నేను వారి అంచనాలను అందుకుంటానని భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఏమి చేయగలనో క్రికెట్​లో చూపించాను. దేశాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దడానికి, ఏదైనా మంచి చేయడానికి ఇది సరైన వేదిక."
- గౌతమ్​ గంభీర్​, భాజపా నేత

​2011 వన్డే ప్రపంచకప్​, 2007 టీ20 ప్రపంచకప్​ విజయాల్లో కీలక పాత్ర పోషించిన గంభీర్​ను... ఇటీవలే పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది కేంద్రప్రభుత్వం. భాజపా వర్గాల సమాచారం ప్రకారం మీనాక్షి లేఖి ప్రాతినిథ్యం వహిస్తున్న 'న్యూ దిల్లీ' పార్లమెంట్​ స్థానం నుంచి లోక్​సభ ఎన్నికల బరిలో దిగనున్నారు గంభీర్​.

Last Updated : Mar 22, 2019, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details