తెలంగాణ

telangana

By

Published : Feb 26, 2021, 10:11 AM IST

Updated : Feb 26, 2021, 12:57 PM IST

ETV Bharat / sports

మొతేరా పిచ్​పై మాజీల భిన్నాభిప్రాయాలు

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన గులాబి టెస్టు పిచ్​పై మాజీ క్రికెటర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. టెస్టు క్రికెట్​కు ఇలాంటి పిచ్​ సరైనది కాదని లక్ష్మణ్, భజ్జీ అభిప్రాయపడగా.. పిచ్​ కన్నా బ్యాట్స్​మెన్ వైఖరి ప్రధానమని దిగ్గజాలు సునీల్ గావస్కర్, పీటర్సన్ అన్నారు.

Former players feel Motera pitch not ideal for Tests; Gavaskar thinks otherwise
మొతేరా పిచ్​పై మాజీల భిన్నాభిప్రాయాలు

రెండు రోజుల్లోనేమూడో టెస్టు ముగియడం వల్ల మొతేరా పిచ్​పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ వికెట్​ టెస్టు మ్యాచ్​లకు సరైంది కాదని దిగ్గజాలు వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే అది ముమ్మాటికీ బ్యాట్స్​మెన్​ వైఫల్యమేనని మాజీలు సునీల్ గావస్కర్, కెవిన్ పీటర్సన్ అన్నారు. స్పిన్​ బౌలింగ్​కు విపరీతంగా అనుకూలించిన మొతేరా పిచ్​​పై 10 వికెట్ల తేడాతో ఇంగ్లీష్​ జట్టును చిత్తు చేసింది టీమ్​ఇండియా.

గులాబి టెస్టు

"టెస్టు మ్యాచ్​కు ఈ పిచ్​ సరైనది కాదు. భారత్​ కూడా తొలి ఇన్నింగ్స్​లో 145 పరుగులకే కుప్పకూలింది."

-వీవీఎస్ లక్ష్మణ్, భారత మాజీ క్రికెటర్

లక్ష్మణ్, హర్భజన్

"ఇది సరైన పిచ్​ కాదు. తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్ 200 పరుగులు చేసి ఉంటే భారత్​ ఇబ్బందుల్లో పడేది. రెండు జట్లకు అదే వర్తిస్తుంది."

-హర్భజన్ సింగ్, టీమ్​ఇండియా వెటరన్​స్పిన్నర్

"రెండు రోజుల్లో మ్యాచ్​ అయిపోయింది! టెస్టు క్రికెట్​కు ఈ పిచ్​ సరైనదేనా అనేది నేను చెప్పలేను. అయితే ఇలాంటి పిచ్​లపై అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్​ బౌలింగ్​ చేసి ఉంటే వరుసగా వెయ్యి, 800 వికెట్ల క్లబ్​లో చేరేవారేమో! అద్భుత ప్రదర్శన చేసిన అక్షర్ పటేల్, అశ్విన్​, ఇషాంత్ శర్మలకు అభినందనలు."

- యువరాజ్ సింగ్, భారత మాజీ ఆల్​రౌండర్

"ఈ పిచ్​ గురించి చెప్పాలంటే.. ప్రతి జట్టుకు మూడు ఇన్నింగ్స్​లు ఇవ్వాలి."

-మైకేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

సునీల్ గావస్కర్

"బ్యాట్స్​మెన్ అంకితభావం, ఆడే విధానంలోనే తేడా ఉంది. ఇదే పిచ్​పై రోహిత్, క్రాలీ అర్ధ సెంచరీలు చేశారు. పరుగులు చేయడంపై కాక ఎలా నిలదొక్కుకోవాలి అనే దానిపైనే ఇంగ్లాండ్ బ్యాట్స్​మన్ దృష్టిపెట్టారు. వికెట్లకు నేరుగా బంతులేసి ఫలితం రాబట్టిన అక్షర్​కు ఘనత చెందుతుంది. అశ్విన్​ కూడా గొప్పగా బౌలింగ్ చేశాడు."

- సునీల్ గావస్కర్, భారత్ మాజీ కెప్టెన్

స్పిన్​ అనుకూల పిచ్​పై ఒకే స్పిన్నర్​తో ఇంగ్లాండ్​ బరిలోకి దిగడాన్ని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ తప్పుబట్టాడు.

"భారత పర్యటనలో ఒకే స్పిన్నర్​తో గట్టెక్కాలంటే అది సాధ్యం కాదు."

- గ్రేమ్ స్వాన్, ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్

"ఒక్క మ్యాచ్​ కోసం ఇలాంటి పిచ్​ వాడటం ఫర్వాలేదు. అది బ్యాట్స్​మెన్ నైపుణ్యాలను పరీక్షిస్తుంది. కానీ మరోసారి ఇలాంటి పిచ్​లను నేను చూడాలనుకోవడం లేదు. క్రికెటర్లు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని అనుకుంటున్నా. మంచి ప్రదర్శన చేసిన టీమ్​ఇండియాకు అభినందనలు."

-కెవిన్ పీటర్సన్, ఇంగ్లాడ్ మాజీ క్రికెటర్

పిచ్​పై గావస్కర్​ అభిప్రాయంతో ఏకీభవిస్తూ మరో ట్వీట్ చేశాడు కెవిన్. "ఇరు జట్ల బ్యాటింగ్ దారుణంగా ఉంది. 30 వికెట్లలో 21 వికెట్లు కేవలం నేరుగా వచ్చిన బంతుల ద్వారానే లభించాయి. పిచ్ అంత భయానకంగా ఏమీ లేదు. బ్యాటింగ్ మాత్రమే ఘోరంగా ఉంది" అని అన్నాడు.

ఇదీ చూడండి:డబ్ల్యూటీసీ: టాప్​లోకి భారత్​- ఇంగ్లాండ్​ ఔట్​

Last Updated : Feb 26, 2021, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details