తెలంగాణ

telangana

ETV Bharat / sports

సచిన్​, కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఇర్ఫాన్​ పఠాన్​ - 4 రోజుల టెస్టు

అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్(ఐసీసీ)​ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనకు మద్దతిచ్చాడు భారత మాజీ క్రికెటర్​ ఇర్ఫాన్​ పఠాన్​. రంజీల్లో ఇదే తరహాలో మ్యాచ్​లు జరుగుతున్నా, అంతర్జాతీయ క్రికెట్లోనే ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతుందని ప్రశ్నించాడు. కొన్ని రోజులు ఈ విధానాన్ని పరిశీలించి చూడాలని అభిప్రాయపడ్డాడు.

Former Indian Cricketer Irfan Pathan Disagrees With Virat Kohli, Sachin Tendulkar Note on 4-Day Tests
సచిన్​, కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఇర్ఫాన్​ పఠాన్​

By

Published : Jan 7, 2020, 4:46 PM IST

Updated : Jan 7, 2020, 5:36 PM IST

నాలుగు రోజుల టెస్టు ఆలోచనపై టీమిండియా మాజీ క్రికెటర్లు మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందూల్కర్​, గౌతమ్​ గంభీర్​ సహా ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్​మన్​ విరాట్​ కోహ్లీ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో... ఈ ప్రతిపాదనకు మద్దతిచ్చాడు భారత మాజీ క్రికెటర్​ ఇర్ఫాన్​ పఠాన్​. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్​ (ఐసీసీ) నిర్ణయం సరైనదే అని అభిప్రాయపడ్డాడు. దేశవాళీల్లోని సుదీర్ఘ ఫార్మట్​ మ్యాచ్​లు నాలుగు రోజులే ఆడుతున్నారని... అందులో ఫలితాలు వస్తున్నాయి కదా అని అన్నాడు.

" సుదీర్ఘ ఫార్మాట్​ భవిష్యత్తు కోసం నాలుగు రోజుల టెస్టుకు మద్దతు పలకాలి. ఈ తరహా మ్యాచ్​లు రంజీల్లో ఇప్పటికే ఆడుతున్నారు. ఫలితాలూ వస్తున్నాయి. అంతర్జాతీయ టెస్టు క్రికెట్​లోకి ఈ విధానం తీసుకొస్తే ఫలితాలు వస్తాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా రెండేళ్ల తర్వాత అయినా వీటిని రెగ్యులర్​గా ప్రవేశపెడితే బాగుంటుంది".
--ఇర్ఫాన్​ పఠాన్​, భారత మాజీ క్రికెటర్​

ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ బోర్డులు ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నాయి. భారత మాజీ క్రికెటర్లు సహా విదేశీ మాజీలు మెక్​గ్రాత్​, రికీ పాంటింగ్​ వంటి ఆటగాళ్లు నాలుగు రోజుల టెస్టును వ్యతిరేకిస్తున్నారు. సంప్రదాయ టెస్టు క్రికెట్​ను కొత్త తరాన్ని ఆకర్షించేందుకు, మార్చాల్సిన అవసరం లేదని సచిన్​​ అభిప్రయపడ్డాడు.

కుంబ్లే నేతృత్వంలో కమిటీ

4 రోజుల టెస్టు అంశం గురించి చర్చించేందుకు అనిల్ కుంబ్లే నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది ఐసీసీ. దుబాయ్ వేదికగా మార్చి 27 నుంచి 31 వరకు జరగనున్న ఈ సమావేశంలో.. ఈ ప్రతిపాదనపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కమిటీలో కుంబ్లేతోపాటు ఆండ్రూ స్ట్రాస్, రాహుల్ ద్రవిడ్, మహేలా జయవర్ధనే, షాన్ పొలాక్ సభ్యులుగా ఉన్నారు. 2023-31 మధ్య కొత్త భవిష్యత్‌ పర్యటనల ప్రణాళికలో... పూర్తిగా నాలుగు రోజుల టెస్టులే ఆడించాలని ఐసీసీ భావిస్తోంది.

Last Updated : Jan 7, 2020, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details