తెలంగాణ

telangana

By

Published : Nov 24, 2019, 7:03 PM IST

ETV Bharat / sports

సంజయ్​ మంజ్రేకర్​పై నెటిజన్ల ఆగ్రహం..

టీమిండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యాడు. తాజాగా ఈడెన్​లో ముగిసిన భారత్​-బంగ్లా టెస్టు సందర్భంగా తీసుకున్న ఓ ఫొటోను షేర్​ చేశాడు సంజయ్. దీనిపై వ్యంగ్యంగా స్పందించారు నెటిజన్లు.

సంజయ్​ మంజ్రేకరపై నెటిజన్లు మీమ్స్​ వర్షం..

టీవీ వ్యాఖ్యాత, మాజీ క్రికెటర్​ సంజయ్‌ మంజ్రేకర్‌ సామాజిక మాధ్యమాల్లో మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యాడు. భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య తొలి డేనైట్‌ టెస్టు జరిగింది. ఈ సందర్భంగా మంజ్రేకర్‌ ఈడెన్‌ పిచ్‌ను పరిశీలిస్తున్న ఫొటోను ట్వీట్‌ చేసి అందులో "లవ్ మై జాబ్‌" అని తెలిపాడు.

ఇది చూసిన నెటిజన్లు సంజయ్​ను ట్రోల్ చేశారు. వివిధ మీమ్స్‌తో ఛలోక్తులు విసిరారు. కొంతమంది..."నీ కామెంట్రీ వస్తే మేం టీవీ రిమోట్‌లో మ్యూట్‌ బటన్‌ను ఇష్టపడతాం" అని స్పందించారు.

గతంలోనూ ఇలానే...

ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా మంజ్రేకర్‌ మీడియాతో మాట్లాడుతూ... జడేజాపై కామెంట్​ చేశాడు. "అడపా దడపా(బిట్స్​ అండ్​ పీసెస్​) ఆడే రవీంద్ర జడేజా లాంటి క్రికెటర్లకు నేను అభిమానిని కాదు" అని అన్నాడు. ఈ విషయంపై స్పందించిన జడేజా వెంటనే కౌంటర్‌ ఇచ్చాడు. "నీ కన్నా ఎక్కువ మ్యాచ్​లు ఆడాను. ఇంకా ఆడుతున్నాను. ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకో. నీ నోటి నుంచి వచ్చే వ్యర్థమైన మాటలు ఆపు" అని జడ్డూ సీరియస్​ అయ్యాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో జడేజా అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుని జట్టును గెలిపించినంత పని చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో జడేజాపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పుకున్నాడు మంజ్రేకర్‌. అప్పట్నుంచి ఈ మాజీ క్రికెటర్‌ ట్విట్టర్‌లో ఏదైనా పోస్టు పెడితే... నెటిజన్లు ఇదే విషయాన్ని ఉద్దేశించి ట్రోలింగ్‌ చేస్తుండటం గమనార్హం.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details