తెలంగాణ

telangana

ETV Bharat / sports

మోదీకి కృతజ్ఞతలు తెలిపిన కుంబ్లే.. ఎందుకంటే? - Pariksha Pe Charcha

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇటీవల విద్యార్థులతో కలిసి 'పరీక్షా పే చర్చా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేదికపై టీమిండియా మాజీ క్రికెటర్​ అనిల్​ కుంబ్లేను ఓ సందర్భంలో ప్రస్తావించారు. తాజాగా ఈ అంశంపై కుంబ్లే స్పందిస్తూ.. తన అభిప్రాయం తెలిపాడు.

Anil Kumble Reaction to PM Narendra Modi
మోదీకి కృతజ్ఞతలు తెలిపిన కుంబ్లే.. ఎందుకంటే?

By

Published : Jan 22, 2020, 8:17 PM IST

Updated : Feb 18, 2020, 12:58 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను ఉదాహరణగా చూపిస్తూ.. విద్యార్థుల్లో ప్రేరణ నింపడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు తెలిపాడు భారత మాజీ క్రికెటర్​ అనిల్‌ కుంబ్లే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో కలిసి ప్రధాని ఇటీవల 'పరీక్షా పే చర్చా' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్‌ కుంబ్లే పేరును మోదీ ప్రస్తావించారు. 2002లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దిగ్గజ స్పిన్నర్‌ కుంబ్లే.. గాయాన్ని లెక్కచేయకుండా దేశం కోసం ఆటను కొనసాగించారని గుర్తుచేశారు.

మోదీ తన పేరు ప్రస్తావించడంపై కుంబ్లే ఇవాళ స్పందించాడు. ట్విట్టర్​ వేదికగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు ఈ మాజీ లెగ్​ స్పిన్నర్​.

"పరీక్షా పే చర్చా- 2020 కార్యక్రమంలో నా గురించి చెప్పడం గర్వంగా ఉంది. థ్యాంక్యూ మోదీజీ. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ ఆల్‌ ది బెస్ట్‌" అని ట్వీట్‌ చేశాడు కుంబ్లే. ఈ పోస్టుకు మోదీ మాట్లాడిన వీడియోను జతచేశాడు.

ఆంటిగ్వా వేదికగా 2002లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో... కుంబ్లే దవడ ఎముకకు గాయమైంది. సర్జరీ చేయాల్సిన పరిస్థితి రావడం వల్ల ఆయనను జట్టు నుంచి తప్పించాలని అనుకున్నారు. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కుంబ్లే బ్యాండేజ్‌ వేసుకుని మ్యాచ్‌ కొనసాగించాడు. కుంబ్లే బ్యాండేజ్‌తో బౌలింగ్‌ చేస్తున్న ఫొటో.. క్రికెట్‌ చరిత్రలోనే గొప్ప చిత్రంగా నిలిచిపోయింది.

Last Updated : Feb 18, 2020, 12:58 AM IST

ABOUT THE AUTHOR

...view details