తెలంగాణ

telangana

శ్రీనివాసన్ కుమార్తె రికార్డు.. టీఎన్​సీఏ చీఫ్​గా ఎన్నిక

By

Published : Sep 26, 2019, 12:53 PM IST

Updated : Oct 2, 2019, 1:56 AM IST

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా బీసీసీఐ మాజీ చీఫ్ ఎన్​.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

రూపా గురునాథ్

భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ చీఫ్​ ఎన్.శ్రీనివాసన్ కూతురు రూపా గురునాథ్​కు కీలక పదవి దక్కింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్​సీఏ)​ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత క్రికెట్​లో ఓ రాష్ట్ర బోర్డుకు ప్రెసిడెంట్​గా ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

ఈ నెల 22న టీఎన్​సీఏ అధ్యక్ష ఎన్నిక ప్రకటన విడుదల చేశారు. బుధవారం సాయంత్రం వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. గురువారం చెన్నైలో జరిగిన టీఎన్​సీఏ 87వ వార్షిక సమావేశంలో రూపా గురునాథ్​ను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.

ఐపీఎల్​ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాలం నిషేధం ఎదుర్కొంటున్న గురునాథ్ మెయప్పన్ సతీమణి రూపా గురునాథ్.

ఇటీవలే తమిళనాడు ప్రీమియర్ లీగ్​లో టీఎన్​సీఏలో కొంత మంది అధికారులు, కోచ్​లు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతోంది.

ఇదీ చదవండి: కొరియా ఓపెన్​ క్వార్టర్స్​లో పారుపల్లి కశ్యప్​

Last Updated : Oct 2, 2019, 1:56 AM IST

ABOUT THE AUTHOR

...view details