తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియా తరఫున 'సుందర్'​ అరుదైన ఘనత - వాషింగ్టన్​ సుందర్​

టీమిండియా యువ బౌలర్​ వాషింగ్టన్​ సుందర్​ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండోర్​ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో ఓపెనర్​ అవిష్క ఫెర్నాండోను ఔట్​ చేసి భారత్​ తరఫున ఈ ఏడాది తొలి వికెట్​ ఖాతాలో వేసుకున్న బౌలర్​గా నిలిచాడు.

First Wicket For Indian in This Year and Decade 2020 by Washington Sundar
ఈ దశాబ్దపు తొలి వికెట్​ ఇతడిదే...

By

Published : Jan 7, 2020, 8:26 PM IST

టీమిండియా తరఫున ఈ ఏడాదితో పాటు 2020 దశాబ్దంలో తొలి వికెట్ తీసిన బౌలర్​గా నిలిచాడు వాషింగ్టన్​ సుందర్.​ ఇండోర్​ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో ఓపెనర్​ అవిష్క ఫెర్నాండోను ఔట్​ చేసి ఈ ఘనత సాధించాడు.

1990లో కపిల్​ దేవ్​, 2000లో శ్రీనాథ్​, 2010లో శ్రీశాంత్​ దశాబ్దపు తొలి వికెట్​ సాధించారు. తాజాగా వాషింగ్టన్​ సుందర్ 2020 దశాబ్దపు మొదటి వికెట్​ నమోదు చేశాడు​.

ఇప్పటివరకు 19 టీ20లు ఆడిన సుందర్​​​​.. 16 వికెట్లు తీశాడు. ఇందులో 3/22 అత్యుత్తమం. మొత్తంగా 6.66ఎకానమీతో పరుగులిచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details