అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) స్వతంత్ర ఛైర్మన్ శశాంక్ మనోహర్ పదవీ కాలం... వచ్చే ఏడాది మే నెలతో పూర్తవుతుంది. ఇప్పటికే రెండుసార్లు ఆ బాధ్యతలు చేపట్టిన శశాంక్... మూడోసారి ఈ పదవిలో కొనసాగలేనని స్పష్టం చేశారు.
" ఇంకో రెండేళ్లు ఐసీసీ ఛైర్మన్గా కొనసాగడానికి సిద్ధంగా లేను. మెజారిటీ డైరెక్టర్లు నన్నే పదవిలో కొనసాగాలని కోరుతున్నారు. ఇప్పటివరకు ఐదేళ్లుగా ఈ బాధ్యతల్లో ఉన్నాను. ఐసీసీ ఛైర్మన్గా నా ప్రయాణం వచ్చే ఏడాది మే నెలతో ముగుస్తుంది. జూన్లో కొత్త వ్యక్తి ఛైర్మన్గా వస్తారు"
-- శశాంక్ మనోహర్, ఐసీసీ ఛైర్మన్
2016 మేలో తొలిసారి ఐసీసీ స్వతంత్ర ఛైర్మన్ పదవిని ఏర్పాటు చేయగా.. శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.