తెలంగాణ

telangana

ETV Bharat / sports

వర్షం వల్ల మూడో టీ20 రద్దు.. సిరీస్​ కివీస్​దే - న్యూజిలాండ్ vs వెస్టిండీస్

బే ఓవల్​లోని మూడో టీ20 వర్షం వల్ల రద్దయింది. దీంతో వెస్టిండీస్​తో జరిగిన సిరీస్​లో కివీస్ విజేతగా నిలిచింది. గురువారం ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Final T20I abandoned due to rain, NZ win series 2-0 against WI
వెస్టిండీస్ న్యూజిలాండ్ క్రికెటర్లు

By

Published : Nov 30, 2020, 3:52 PM IST

వర్షం కారణంగా న్యూజిలాండ్​-వెస్టిండీస్​ మూడో టీ20 రద్దయింది. దీంతో 2-0 తేడాతో సిరీస్ కివీస్ సొంతమైంది.

భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన న్యూజిలాండ్, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన విండీస్.. 2.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం పడి, ఎంతకీ తగ్గకపోవడం వల్ల రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ముందు జరిగిన టీ20ల్లో ఆకట్టుకున్న ల్యూకీ ఫెర్గుసన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్​గా నిలిచాడు.

హామిల్టన్ వేదికగా గురువారం(డిసెంబరు 3), ఈ రెండు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్​ ప్రారంభం కానుంది. మరి అది జరుగుతుందో, వర్షార్పణం అయిపోతుందో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details