తెలంగాణ

telangana

By

Published : Apr 15, 2020, 4:19 PM IST

ETV Bharat / sports

'కరోనాను ఎదుర్కొవడమంటే ప్రపంచకప్​ కోసం పోరాడినట్లే'

కరోనా​ను ఎదుర్కొవడం, ప్రపంచకప్​ కోసం చేసే పోరాటం లాంటిదని అన్నాడు టీమిండియా కోచ్​ రవిశాస్త్రి. అందరి ఇంట్లోనే జాగ్రత్తగా ఉండి, ఈ వైరస్​ను తరిమికొట్టాలని చెప్పాడు.

Fight against COVID-19 is mother of all World Cups: Shastri
'ప్రపంచకప్​లకు అమ్మ వంటిది కరోనా'

కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సెలబ్రిటీలు, సోషల్ మీడియా వేదికగా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా కోచ్​ రవిశాస్త్రి, సందేశాత్మక వీడియోను ట్వీట్​ చేశాడు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశాడు.

"కరోనా మనల్ని విపత్కర పరిస్థితిలోకి తోసేసింది. ఈ వైరస్​ను ఎదుర్కొవడం, ప్రపంచకప్​ గెలిచేందుకు చేసే పోరాటం లాంటిది. దీని కోసం మనం సర్వశక్తుల కృషి చేయాలి. ఇది మామూలు ప్రపంచకప్‌(కరోనా) కాదు. ఇప్పటివరకు చూసిన వాటికి అమ్మ లాంటిది(మదర్ ఆఫ్ ఆల్ ప్రపంచకప్స్). ఇక్కడ కేవలం 11 మంది మాత్రమే పోరాటం చేయరు. 130 కోట్ల మంది భారతీయులు తమ వంతు పాత్ర పోషించాలి. అయితే గెలవడం అంత సులభం కాదు. మనందరం ఏకతాటిపైకి వచ్చి కరోనాపై విజయం సాధించాలి. ప్రధాన మోదీ మార్గనిర్దేశకంలో నడిచి, మనల్ని మనదేశాన్ని కాపాడుకుందాం"

-రవిశాస్త్రి, టీమిండియా కోచ్​

ఇప్పటివరకు కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షా 20 వేల మంది మరణించగా, 20 లక్షల మందికి పైగా ఈ వైరస్​ బారినపడ్డారు. భారత్​లో 350 మందికి పైగా మృత్యువాతపడగా, 11 వేలమందికిపైగా ఈ వైరస్​ సోకింది. ప్రస్తుతం భారత్​లో మే 3 వరకు లాక్​డౌన్ పెంచారు.

ఇదీ చూడండి : 'ఐపీఎల్‌ కంటే‌ మాకు ఆ టోర్నీయే ముఖ్యం'

ABOUT THE AUTHOR

...view details