తెలంగాణ

telangana

By

Published : Nov 30, 2020, 9:24 AM IST

ETV Bharat / sports

'ఇప్పటికైనా రోహిత్​కు టీ20 బాధ్యతలు అప్పగించండి'

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్​ను చేజార్చుకోవడం వల్ల టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. కోచ్​ రవిశాస్త్రి - కోహ్లీ కాంబినేషన్​లో టీమ్​ఇండియా ఆకట్టుకోలేకపోయిందని నెట్టింట అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా టీ20 కెప్టెన్​గా కోహ్లీ స్థానంలో రోహిత్​శర్మను నియమించాలని డిమాండ్​ చేస్తున్నారు.

Fans demanding Rohit Sharma captaincy after ODI series defeat in Australia
'ఇప్పటికైనా రోహిత్​శర్మకు టీ20 బాధ్యతలు అప్పగించండి'

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల్లోనూ టీమ్​ఇండియా పరాజయాన్ని ఎదుర్కొంది. మూడు వన్డేల సిరీస్​లో రెండింటిలో ఓడి.. కోహ్లీసేన సిరీస్​ను చేజార్చుకుంది. జరిగిన రెండు మ్యాచ్​ల్లోనూ కంగారూలు ఆల్​రౌండ్​ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. ఆసీస్​ బౌలర్లను ఎదుర్కోవడం సహా వారి బ్యాట్స్​మెన్​ను కట్టడి చేయడంలో భారత బౌలర్ల విఫలమయ్యారు. దీంతో కోహ్లీసేనపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో​ కోహ్లీ బ్యాటింగ్​లో పర్వాలేదనిపించినా.. కెప్టెన్​గా పూర్తిగా విఫలమయ్యాడని నెటిజన్లు అంటున్నారు. కోచ్​ రవిశాస్త్రి నేతృత్వంతో పాటు కోహ్లీ నాయకత్వంలోని టీమ్​ఇండియా జట్టు పూర్తిగా విఫలమయ్యిందని అభిప్రాయపడుతున్నారు. భారత జట్టులో నాయకత్వ మార్పు కావాలని అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికైనా టీ20 పగ్గాలను రోహిత్​శర్మకు అప్పగించాలని బీసీసీఐని డిమాండ్​ చేస్తున్నారు.

క్రికెట్​ అభిమానుల స్పందన:

ఇదీ చూడండి:రెండో వన్డేలోనూ భారత్ ఓటమి.. సిరీస్​ ఆసీస్​దే

ABOUT THE AUTHOR

...view details