దక్షిణాఫ్రికా టెస్టు జట్టు సారథి డుప్లెసిస్కు కోపమొచ్చింది. భారత్తో టెస్టు సిరీస్ కోసం వస్తుండగా బ్రిటీష్ ఎయిర్లైన్స్ విమానం ఆలస్యమైంది. గమ్యాన్ని సకాలంలో చేరుకోలేకపోయాడు. అసహనానికి గురైన ఈ క్రికెటర్.. ట్విట్టర్ వేదికగా ఆ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
"నేను దుబాయ్ రావడానికి నాలుగు గంటలు ఆలస్యమైంది. బ్రిటీష్ ఎయిర్వేస్ విమానం ఆలస్యంగా వచ్చింది. ఫలితంగా నేను భారత్కు వెళ్లే విమానాన్ని దుబాయ్లో అందుకోలేకపోతున్నాను. తదుపరి విమానం 10 గంటల తర్వాత ఉంది." -డుప్లెసిస్, దక్షిణాఫ్రికా ఆటగాడు
మరో ట్వీట్లో బ్రిటీష్ ఎయిర్వేస్పై విమర్శలు చేశాడీ క్రికెటర్.