ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు తొలిసారి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనుంది. అక్టోబరులో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లో పరుషుల జట్టుతో పాటు మహిళా జట్టు కూడా రెండు టీ20(అక్టోబరు 14,15)లు మూడు వన్డే(అక్టోబర్ 18,20,22) మ్యాచులు ఆడేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మ్యాచ్లు కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి.
పాక్ పర్యటనకు తొలిసారిగా ఇంగ్లాండ్ మహిళా జట్టు - పాకిస్థాన్ పర్యటనకు ఇంగ్లాండ్ మహిళా జట్టు
ఈ ఏడాది అక్టోబరులో ఇంగ్లాండ్ పురుషుల జట్టుతో పాటు మహిళా క్రికెట్ జట్టు కూడా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనుంది. ఇరు దేశాల జట్లు రెండు టీ20, మూడు వన్డేలతో కూడిన పరిమిత ఓవర్ల సిరీస్లో తలపడనున్నారు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
ఇంగ్లాండ్
కాగా, తమ దేశ మహిళా క్రికెట్ జట్టు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టడం తమ క్రికెట్ చరిత్ర, ప్రయాణంలో ఓ ముఖ్యమైన ఘట్టమని అన్నారు ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ కానర్. ఈ విషయమై హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : ఆసీస్ బోర్డుకు బీసీసీఐ లేఖ.. ఎందుకంటే?