తెలంగాణ

telangana

By

Published : May 31, 2020, 1:03 PM IST

ETV Bharat / sports

ఆ దేశంలో క్రికెట్​, ఫుట్​బాల్ పోటీలు పునః ప్రారంభం

జూన్​ 1 నుంచి క్రీడలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. ఫలితంగా ఇంగ్లాండ్​లోని క్రికెట్​, ఇతర క్రీడా మైదానాలు ఆటగాళ్ల శిక్షణతో పూర్వవైభవాన్ని సంతరించుకోనున్నాయి.

England government has given the green light for Cricket from June 1 behind closed doors
జూన్​ 1 నుంచే ఇంగ్లాండ్​లో క్రికెట్ పునః​ ప్రారంభం

అంతర్జాతీయ క్రికెట్‌ స్తంభించి దాదాపు రెండు నెలలు గడిచింది. ఆటగాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆయా క్రికెట్ బోర్డుల కార్యాలయాలను తాత్కాలికంగా మూసేశారు. అధికారులు ఇంటినుంచే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది క్రీడా రంగం. ప్రపంచంలోనే అత్యధికులు చూసే ఫుట్​బాల్​, క్రికెట్​పై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో క్రికెట్​ను మళ్లీ పునరుద్ధరించే చర్యలు చేపట్టింది ఇంగ్లాండ్​ ప్రభుత్వం. క్రీడలపై ఆంక్షలు సడలిస్తూనే.. కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.

అభిమానులకు నో ఎంట్రీ

దేశవ్యాప్తంగా అన్ని క్రీడలకు జరిపేందుకు పచ్చజెండా ఊపింది​ ఇంగ్లాండ్​. అయితే ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాల్లోనే నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. ఆటగాళ్లు భౌతిక దూరం పాటించాలని, ఈ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని చెప్పింది.

"నిరీక్షణ తొలగిపోయింది. రక్షణ పద్ధతులు పాటిస్తూ, బ్రిటన్​ దేశంలో క్రీడలు మొదలుకానున్నాయి. ఆయా క్రీడా ప్రాంతాలపై పర్యవేక్షణ మాత్రం తప్పకుండా ఉంటుంది"

-- ఒలీవర్​ డవ్డెన్​, డీసీఎంఎస్​(డిజిటల్​,కల్చర్​,మీడియా,స్పోర్ట్స్​)​విభాగాధిపతి

వాళ్లే ఎంపిక!

క్రికెటర్లు శిక్షణా శిబిరాలకు హాజరు కావాలని ఇంగ్లాండ్​ వేల్స్​ క్రికెట్​ బోర్డు, శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే ప్రాక్టీస్​లో పాల్గొంటారో వారు జో రూట్​ సారథ్యంలోని టెస్టు జట్టు, ఇయాన్​ మోర్గాన్​ నేతృత్వంలోని పరిమిత ఓవర్ల టీమ్​లో చోటు సాధించొచ్చని తెలిపింది.

ప్రీమియర్​ లీగ్​ అప్పుడే?

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది ప్రీమియర్​ లీగ్​. జూన్​ మూడో వారం నుంచి టోర్నీని తిరిగి ప్రారంభించాలనే యోచనలో ఉన్న నిర్వాహకులు... ప్రభుత్వ ఆదేశాలతో మ్యాచ్​లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మెగాటోర్నీలో షెఫీల్డ్​ యునైటెడ్​, మాంచెస్టర్​ సిటీ, ఆస్టన్​ విల్లా, అర్సెనాల్​ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా మధ్యలో ఆగిన వీటి మ్యాచ్​లను.. జూన్​ 19-21 మధ్య జరపనున్నారు.

ABOUT THE AUTHOR

...view details