అంతర్జాతీయ క్రికెట్ స్తంభించి దాదాపు రెండు నెలలు గడిచింది. ఆటగాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆయా క్రికెట్ బోర్డుల కార్యాలయాలను తాత్కాలికంగా మూసేశారు. అధికారులు ఇంటినుంచే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది క్రీడా రంగం. ప్రపంచంలోనే అత్యధికులు చూసే ఫుట్బాల్, క్రికెట్పై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో క్రికెట్ను మళ్లీ పునరుద్ధరించే చర్యలు చేపట్టింది ఇంగ్లాండ్ ప్రభుత్వం. క్రీడలపై ఆంక్షలు సడలిస్తూనే.. కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
అభిమానులకు నో ఎంట్రీ
దేశవ్యాప్తంగా అన్ని క్రీడలకు జరిపేందుకు పచ్చజెండా ఊపింది ఇంగ్లాండ్. అయితే ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాల్లోనే నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. ఆటగాళ్లు భౌతిక దూరం పాటించాలని, ఈ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని చెప్పింది.
"నిరీక్షణ తొలగిపోయింది. రక్షణ పద్ధతులు పాటిస్తూ, బ్రిటన్ దేశంలో క్రీడలు మొదలుకానున్నాయి. ఆయా క్రీడా ప్రాంతాలపై పర్యవేక్షణ మాత్రం తప్పకుండా ఉంటుంది"