తెలంగాణ

telangana

ETV Bharat / sports

దక్షిణాఫ్రికాతో మ్యాచ్.. ఇంగ్లాండ్​ క్రికెటర్లకు జ్వరం - Jos Buttler news

టెస్టు సిరీస్​ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన ఇంగ్లాండ్ క్రికెటర్లకు జ్వరమొచ్చింది. కెప్టెన్​ జో రూట్​, జోస్​ బట్లర్.. అస్వస్థతకు గురైనట్లు యాజమాన్యం చెప్పింది. వీరిద్దరితో కలిపి మొత్తం ఆరుగురు అనారోగ్యం పాలయ్యారు.

England captain Joe Root and wicketkeeper Jos Buttler
దక్షిణాఫ్రికాలో జ్వరం బారిన ఇంగ్లాండ్​ క్రికెటర్లు

By

Published : Dec 28, 2019, 7:20 PM IST

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్‌ జట్టుకు విచిత్రమైన సమస్య ఎదురైంది. దాదాపు సగం మంది క్రికెటర్లు అనారోగ్యంతో బాధపడుతున్నారు. సెంచూరియన్‌లో ఇరుజట్లు తొలి టెస్టు ఆడుతున్నాయి. మూడో రోజైన శనివారం ఉదయం.. ఇంగ్లీష్‌ జట్టు సారథి జో రూట్‌, కీపర్‌ జోస్‌ బట్లర్‌ అసౌకర్యానికి గురయ్యారు. బట్లర్‌ అసలు మైదానంలోకే రాకపోవడం వల్ల బెయిర్‌స్టో వికెట్‌ కీపింగ్‌ చేశాడు. రూట్‌ కాసేపు ఫీల్డింగ్‌ చేసినప్పటికీ, డ్రింక్స్‌ విరామం రాగానే డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపోయాడు.

అస్వస్థతతో జాక్‌లీచ్‌, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌వుడ్‌.. హోటల్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వారికి తోడుగా ఇద్దరు సహాయ సిబ్బంది ఉన్నారు. మరో క్రికెటర్​ ఒలివ్‌ పాప్‌ ఆరోగ్యం మెరుగైంది. సాధనకు హాజరయ్యే అవకాశం ఉంది.

ఆర్చర్​ ఐదు వికెట్లు

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రూట్‌.. దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. డికాక్‌ (95) ఆదుకోవడం వల్ల తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులు చేశారు సఫారీలు. అనంతరం ఫిలాండర్‌ 4, రబాడ 3 వికెట్లతో విజృంభించడం వల్ల ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కుప్పకూలింది.

అయితే సఫారీలను రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు ఇంగ్లీష్ బౌలర్​ జోఫ్రా ఆర్చర్. 5 వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా 272 పరుగుల​కే ఆలౌటైంది దక్షిణాఫ్రికా. తొలి టెస్టులో గెలవాలంటే మరో రెండ్రోజుల్లో 376 పరుగులు చేయాలి ఇంగ్లాండ్​.

ABOUT THE AUTHOR

...view details