తెలంగాణ

telangana

ETV Bharat / sports

రంజీలో 'ఈడెన్​ గార్డెన్స్​' కథ రిపీట్ - Jharkhand history in Ranji Trophy

ప్రతిష్ఠాత్మక దేశవాళీ రంజీ టోర్నీలో ఝార్ఖండ్‌ చారిత్రక విజయం నమోదు చేసింది. ఫాలో ఆన్‌ ఆడి ప్రత్యర్థిని ఓడించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. త్రిపురతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఝార్ఖండ్‌ 54 పరుగుల తేడాతో గెలిచి ఈ ఘనతను సొంతం చేసుకుంది.

Eden Gardens result repeat in ranji trophy match Jharkhand 1st team win after following on
రంజీలో 'ఈడెన్​ గార్డెన్స్​' కథ రిపీటైంది!​

By

Published : Dec 13, 2019, 4:32 PM IST

85 ఏళ్ల 'రంజీ' క్రికెట్​ చరిత్రలో అద్భుతం జరిగింది. ఫాలో ఆన్​ ఆడి గెలిచిన తొలి జట్టుగా ఝార్ఖండ్​ నిలిచింది. అగర్తలా వేదికగా త్రిపురతో గురువారం జరిగిన మ్యాచ్​లో ఈ విశేషం చోటు చేసుకుంది. ఝార్ఖండ్​ తరఫున ఇషాంక్ జగ్గీ, సౌరభ్ తివారీ శతకాలు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

త్రిపురకు షాక్​..

త్రిపుర సారథి మిలింద్ (59), హర్మీత్‌ సింగ్‌ (56) అర్ధశతకాలతో రాణించడం వల్ల తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు.. మొదటి ఇన్నింగ్స్‌లో 298 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఝార్ఖండ్.. రాణా (4/42), అభిజిత్‌ (3/43)​ ధాటికి 136 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 153 పరుగుల ఆధిక్యంలో నిలిచిన ఆతిథ్య జట్టు.. ఝార్ఖండ్‌ను ఫాలోఆన్‌ ఆడించింది.

రెండో ఇన్నింగ్స్​లో​ బ్యాటింగ్​కు దిగిన ఝార్ఖండ్‌ అద్భుతంగా పుంజుకుని భారీస్కోరు సాధించింది. ఆ జట్టు బ్యాట్స్​మెన్లలో ఇషాంక్​ జగ్గీ 107 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్​గా వెనుదిరిగాడు. మరో ఎండ్​లో ఉన్న సౌరభ్ తివారీ 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా 8 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేశారు.

అనంతరం 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన త్రిపుర.. ఝార్ఖండ్ బౌలర్లకు తలవంచింది. పర్యాటక జట్టులో ఆశిష్ కుమార్ 5 వికెట్లు తీశాడు. అతడికి తోడుగా ఎమ్​బీ మురుగేశన్ మిగతా వికెట్లు పడగొట్టి, త్రిపురను 103 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. త్రిపుర బ్యాట్స్​మెన్లలో మణిశంకర్​(103) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. తద్వారా రంజీ టోర్నీ చరిత్రలో ఫాలో ఆన్​ ఆడి గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించిందిఝార్ఖండ్ .

గతంలో ఈడెన్​లోనూ ఈ వింత...

2001లో ఈడెన్ గార్డెన్స్​ వేదికగా భారత్​-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్​ అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్​లో లక్ష్మణ్ చేసిన ప్రదర్శన అతడి కెరీర్​లో వెరీ వెరీ స్పెషల్ అయింది. ఈ టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​లో 445 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు మొదటి ఇన్నింగ్స్​లో 171 పరుగులకే కుప్పకూలింది.

ఫాలోఆన్​కు దిగిన టీమిండియా.. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. మొదటి ఇన్నింగ్స్​లో ఆరో స్థానంలో బ్యాటింగ్​కు దిగిన లక్ష్మణ్.. రెండో ఇన్నింగ్స్​లో వన్​డౌన్​లో వచ్చి 281 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ద్రవిడ్​(180) చక్కని సహకారం అందించాడు. ఫలితంగా భారత జట్టు 657/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. చివరి రోజు 75 ఓవర్లలో 384 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందనగా... భారత బౌలర్ల ధాటికి 212 రన్స్​కే ఆలౌట్​ అయింది ఆస్ట్రేలియా. తొలి ఇన్నింగ్స్​లో హ్యాట్రిక్ సహా 7 వికెట్లు సాధించినహర్భజన్.. రెండో ఇన్నింగ్స్​లో ఆరు వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. ఫలితంగా 171 పరుగుల తేడాతో నెగ్గిన భారత జట్టు​.. క్రికెట్​ చరిత్రలో అద్భుత విజయాన్ని నమోదు చేసింది​. టెస్టుల్లో 17 వరుస విజయాలు సాధించిన ఆసీస్​ను నిలువరించి చరిత్ర సృష్టించింది.

ABOUT THE AUTHOR

...view details