తెలంగాణ

telangana

ETV Bharat / sports

చితక్కొట్టిన పాండ్య.. ఈసారి సిక్సర్లతోనే సెంచరీ - DY Patil T20 tournament

డీవై పాటిల్ టీ20 టోర్నీలో హార్దిక్ పాండ్య మరోసారి రెచ్చిపోయాడు. సెమీస్​లో 55 బంతుల్లో 158 పరుగులు చేసి ఔరా అనిపించాడు.

చితక్కొట్టిన పాండ్య.. ఈసారి సిక్సర్లతోనే సెంచరీ
హార్దిక్ పాండ్య

By

Published : Mar 6, 2020, 3:18 PM IST

భారత్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య.. మరోసారి బ్యాట్​తో దంచికొట్టాడు. రీఎంట్రీలో దేశవాళీ లీగ్​ డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఆడుతున్న ఇతడు.. ఇటీవలే సెంచరీ(105) చేశాడు. మళ్లీ ఈరోజు చితక్కొట్టేశాడు. సెమీస్​లో భారత్ పెట్రోలియం కంపెనీతో జరిగిన మ్యాచ్​లో 55 బంతుల్లో 158 పరుగులు చేశాడు. ఇందులో 20 సిక్సర్లు, 6 ఫోర్లు ఉండటం విశేషం. ఇతడి వల్ల 4 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు చేసింది అతడి జట్టు.

55 బంతుల్లో 158 పరుగులు చేసిన హార్దిక్ పాండ్య

26 ఏళ్ల పాండ్య.. వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని, ఇటీవలే కోలుకున్నాడు. ఈ మధ్యే తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. త్వరలో ఐపీఎల్ మొదలు కానుంది. అందులోనూ ఇలాంటి ఇన్నింగ్స్​లే ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details