తెలంగాణ

telangana

By

Published : Jul 3, 2019, 9:30 AM IST

ETV Bharat / sports

ద్రవిడ్​కు అడ్డుగోడగా 'పరస్పర విరుద్ధ ప్రయోజనాలు'..

జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) ప్రధాన కోచ్​గా ఎంపికైన భారత మాజీ ఆటగాడు రాహుల్​ ద్రవిడ్​ ఇప్పటికీ ఆ బాధ్యతలు చేపట్టలేదు. ప్రస్తుతం అండర్‌-19, భారత్‌-ఏ జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్న ఆయన... జులై 1నే ఎన్‌సీఏలో చేరాల్సి ఉంది. కానీ బీసీసీఐ ఇటీవల పెట్టిన పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన ఇందుకు అడ్డుగోడగా నిలుస్తోంది.

ద్రవిడ్​కు అడ్డుగోడగా 'పరస్పర విరుద్ధ ప్రయోజనం'

టీమిండియా మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ప్రధాన కోచ్‌ బాధ్యతలు ఇంకా స్వీకరించలేదు. బీసీసీఐ విధించిన ఒక వ్యక్తికి ఒకే పదవి నిబంధన ఆ పదవిలో చేరనీయకుండా ద్రవిడ్‌కు అడ్డుతగులుతోంది. ప్రస్తుతం ఇండియా సిమెంట్స్‌లో ఉద్యోగిగా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌... జులై 1న జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. కానీ.. బీసీసీఐ నూతన నిబంధనల ప్రకారం క్రికెట్‌కు సంబంధించిన ఏ వ్యక్తీ ఒకేసారి రెండు పదవుల్లో ఉండరాదు. అందుకే మిస్టర్​ వాల్​ ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంది.

రాహుల్​ ద్రవిడ్​

" ద్రవిడ్ ఇంకా జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించలేదు. అతడు ఆ పదవిలో చేరాలంటే ఇండియా సిమెంట్స్‌కు రాజీనామా చేయాలి ".
- బీసీసీఐ ఉన్నతాధికారి

రెండు పదవుల్లో ఉన్నారని ఇటీవల మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌పై బీసీసీఐ అంబుడ్స్‌మన్‌లో ఫిర్యాదు చేశారు మధ్యప్రదేశ్ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా. పిటిషన్​ వేసిన వ్యక్తికి అనుకూలంగా తీర్పునూ వెల్లడించారు అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ డీకే జైన్‌.

ద్రవిడ్‌పైనా గుప్తా ఫిర్యాదు చేయడం వల్లే ఎన్‌సీఏ బాధ్యతల స్వీకరణ ఆలస్యం అవుతోంది. రెండేళ్లు ఎన్​సీఏ బాధ్యతలు నిర్వహించనున్న ద్రవిడ్‌.... ఎన్​సీఏ, జోనల్ క్రికెట్ అకాడమీలలో కోచ్‌ల నియామకంతో పాటు మహిళలు, తర్వాతి తరం క్రికెటర్లపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details