తెలంగాణ

telangana

ETV Bharat / sports

భవిష్యత్ ప్రణాళికలపై గంగూలీ మాటిదే! - ganguly bcci

కరోనా కారణంగా వాయిదా పడ్డ సిరీస్​లపై ఇప్పుడిప్పుడే ఓ స్పష్టత వస్తోంది. తాజాగా టీమ్​ఇండియా భవిష్యత్​ ప్రణాళికలతో పాటు దేశవాళీ టోర్నీల నిర్వహణపై స్పష్టతనిచ్చాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.

భవిష్యత్ ప్రణాళికలపై గంగూలీ మాటిదే!
భవిష్యత్ ప్రణాళికలపై గంగూలీ మాటిదే!

By

Published : Aug 22, 2020, 12:39 PM IST

కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. భారత్​లో మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో ఈ ఏడాది ఇక్కడ సిరీస్​లు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో పలు సిరీస్​లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఐపీఎల్​ యూఏఈకి తరలివెళ్లింది. తాజాగా టీమ్​ఇండియా భవిష్యత్​ ప్రణాళికలపై స్పందించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. రాష్ట్ర సంఘాలకు రాసిన లేఖలో స్పష్టతనిచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్​తో సిరీస్​లో తలపడతారని వెల్లడించాడు.

"కోహ్లీసేన ఈ ఏడాది డిసెంబర్​లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతుంది. ఆ సిరీస్ ముగిసిన వెంటనే ఇండియాకు తిరిగి వచ్చి ఇంగ్లాండ్​తో సిరీస్​లో తలపడుతుంది. ఈ సిరీస్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. దీని తర్వాత ఏప్రిల్​లో ఐపీఎల్​ నిర్వహిస్తాం."

-బీసీసీఐ లేఖలో గంగూలీ

ఈ టోర్నీలతో పాటు వచ్చే ఏడాది భారత్​లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. తర్వాత ఏడాది 2023లో వన్డే ప్రపంచకప్​కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయంపైనా క్లారిటీ ఇచ్చాడు గంగూలీ. ఈ రెండు మెగాటోర్నీల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.

దేశవాళీ టోర్నీలపై!

ప్రతి ఏడాది దేశవాళీ టోర్నీలు ఆగస్టులో ప్రారంభం అవుతాయి. కానీ ఈ ఏడాది మహమ్మారి వల్ల టోర్నీల నిర్వహణ కష్టతరంగా మారింది. దీనిపైనా స్పందించిన గంగూలీ పరిస్థితులు చక్కబడ్డాక పోటీలు నిర్వహిస్తామని స్పష్టం చేశాడు. ఆటగాళ్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకునే బోర్డు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించాడు. మరికొన్ని వారాల్లో పరిస్థితులు చక్కబడే అవకాశం ఉందని.. అప్పుడు సురక్షిత వాతావారణంలో దేశవాళీ టోర్నీలు నిర్వహిస్తామని స్పష్టం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details