తెలంగాణ

telangana

ETV Bharat / sports

శునకాల కోసం స్టేడియంలో 'డాగ్​ అవుట్​' - BANGLORE

వినూత్న ఆలోచనలతో అభిమానులను ఆకట్టుకుంటోంది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో పెంపుడు జంతువులతో మ్యాచ్​ చూసే సదుపాయాన్ని కల్పిస్తోంది.

శునకాలతో పాటు మ్యాచ్​లు చూసే అవకాశం కల్పించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు

By

Published : Mar 18, 2019, 6:00 AM IST

భారత్​లో ఐపీఎల్​​ను విపరీతంగా అభిమానిస్తారు. స్టేడియంలో మ్యాచ్​లు చూసే అభిమానులు డగౌట్​ గురించి వినే ఉంటారు. కానీ ఈ సీజన్​లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మాత్రం 'డాగ్ అవుట్' చూడనున్నారు. అభిమానులు తమ పెంపుడు జంతువులతో పాటు ఇక్కడ కూర్చొని మ్యాచ్​ను వీక్షించొచ్చు.

బెంగళూరు జట్టు అధికారిక వెబ్​సైట్​లో... అభిమానులు తమ పెంపుడు జంతువు​తో దిగిన స్వీయ చిత్రాన్ని పోస్టు చేయాలి. అలా పెట్టిన వారిలో 30 మందిని ఎంపిక చేస్తారు. వారికి మ్యాచ్​ చూసే అవకాశం కల్పిస్తారు. పిల్లి, శునకాలను మాత్రమే ఈ 'డాగ్​ అవుట్​'లోకి అనుమతిస్తారు.

జంతు ప్రేమికుల కోసం ప్రత్యేక ప్రదేశం ఏర్పాటు చేశాం. వాటిపై శ్రద్ధ తీసుకునేందుకు కొంతమందిని నియమించాం --ఆర్సీబీ అధికారి

మమ్మల్ని అభిమానించే వారిపై మేం శ్రద్ధ వహిస్తున్నాం. పెంపుడు జంతువుల్ని మా కుటుంబంలో భాగం చేసుకోవాలి అనుకుంటున్నాం. ఈ సీజన్​ నుంచి పెట్స్​తో కలిసి అభిమానులు మ్యాచ్​లను వీక్షించొచ్చు --ఆర్సీబీ జట్టు

విరాట్ నేతృత్వంలో ఉరకలేస్తున్న బెంగళూరు జట్టు... మార్చి 28న సొంత మైదానంలో జరిగే మ్యాచ్​లో ముంబయితో తలపడనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details