తెలంగాణ

telangana

By

Published : Oct 29, 2019, 5:10 AM IST

ETV Bharat / sports

టీమిండియా భవిష్యత్తు కోసం ద్రవిడ్​​తో గంగూలీ భేటీ

బుధవారం బెంగళూరులో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో భేటీ కానున్నాడు ఎన్​సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్. భారత క్రికెట్ భవిష్యత్తు గురించి వీరు చర్చించనున్నారు.

ద్రవిడ్​​తో గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్​సీఏ) చీఫ్ రాహుల్ ద్రవిడ్.. బెంగళూరులో బుధవారం కలుసుకోనున్నారు. ఒకప్పటి సహచరులైన వీరిద్దరూ, భారత క్రికెట్ భవిష్యత్తు కార్యచరణ గురించి చర్చించబోతున్నారు.

జూలైలో ఎన్​సీఏ చీఫ్​గా బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్.. ఇప్పటికే భారత క్రికెట్​కు సంబంధించి ఓ కార్యచరణను రూపొందించాడు. దానిపై గంగూలీ కొన్ని సూచనలు ఇవ్వనున్నాడు.

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ

ఇంతకు ముందే బీసీసీఐ నిర్వహించిన టెక్నికల్ మీటింగ్స్​లో వీరిద్దరూ కలిసి పాల్గొనేవారు. గంగూలీ 'ప్రిన్స్ ఆఫ్ కోల్​కతా'(కాబ్ అధ్యక్షుడు) హోదాలో, అండర్-19, టీమిండియా-ఏ కోచ్​ హోదాలో ద్రవిడ్.. ఈ సమావేశాలకు వెళ్లేవారు.

గత కొన్నేళ్లుగా ఎన్​సీఏ, భారత క్రికెట్ జట్టుకు పునరావస కేంద్రంగా మారింది. ఆటగాళ్లు తమ ప్రదర్శనను మెరుగుపరుచుకోవడం కోసం ఎన్​సీఏను ఆశ్రయిస్తున్నారు. అయితే గంగూలీ-ద్రవిడ్​ భేటీలో అకాడమీ గురించి చర్చిండం సహా.. అది ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించనున్నారు.

ఇది చదవండి: దాదా గురించి మీకు తెలియని విషయాలు..!

ABOUT THE AUTHOR

...view details