తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ వ్యాపారాన్ని తాకిన బర్డ్​ ఫ్లూ సెగ! - 'Kadaknath hens dhoni order cancell

కడక్​నాథ్ కోళ్ల వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీకి చుక్కెదురైంది. అతడు ఆర్డర్​ చేసిన పౌల్ట్రీలోని ఈ జాతికి చెందిన 2000 కోళ్లు బర్డ్​ ఫ్లూ సోకి మరణించాయి.

dhoni
ధోనీ

By

Published : Jan 14, 2021, 5:30 AM IST

టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీకి బర్డ్​ ఫ్లూ సెగ తాకింది. మహీ కడక్​నాథ్​ కోళ్ల వ్యాపారానికి ఆటంకం కలిగింది. అత్యధిక పోషక విలువులున్న ఈ​ కోళ్ల ఫామ్​ను స్వస్థలం రాంచీలో​ త్వరలో తెరిచేందుకు ధోనీ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే అతడి బృందం, మధ్యప్రదేశ్​ జబువా జిల్లాకు చెందిన ఓ పౌల్ట్రీతో 2000 కోళ్ల కోసం ఒప్పందాన్ని చేసుకుంది.

అయితే కొంతకాలం నుంచి బర్డ్​ ఫ్లూ సోకి కోళ్లు లక్షల సంఖ్యలో చనిపోతున్నాయి. ఈ క్రమంలోనే ధోనీ అర్డర్​ చేసిన పౌల్ట్రీలోని కడక్​నాథ్​ కోళ్లకు ఈ రోగం సోకింది. దీంతో అవి మరణించాయి. ఫలితంగా మహీ ఆర్డర్​ రద్దయింది. ​

ఇదీ చూడండి : ఒకే ఫ్రేమ్​లో ధోనీ, జీవా.. ఫ్యాన్స్​ ఫుల్ ఖుష్

ABOUT THE AUTHOR

...view details