జులై 7న టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది మహీ సతీమణి సాక్షి. ఇందులో క్రికెటర్స్ కృనాల్, హార్దిక్ పాండ్య, ధోనీ సహా మరికొంతమంది కనువిందు చేశారు. అయితే వీరందరినీ మిస్ అవుతున్నట్లు చెప్పింది సాక్షి. 'వీరందరితో కలిసి గడిపిన ఈ ఆనంద వేడుకను మిస్ అవుతున్నా' అంటూ రాసుకొచ్చింది.
'ధోనీ బర్త్డే సెలబ్రేషన్లో పాండ్య సోదరులు' - ధోనీ సాక్షి ఫొటో పోస్ట్
టీమ్ఇండియా మాజీ సారథి ధోనీ పుట్టిన రోజు వేడుకకు హాజరైన వారిని మిస్ అవుతున్నట్లు తెలిపింది అతడి సతీమణి సాక్షి. ఆ వేడుకకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్స్టోలో పోస్ట్ చేసింది. ఇందులో క్రికెటర్స్ పాండ్య బ్రదర్స్ ఉన్నారు.
ధోనీ
మహీ పుట్టిన రోజు సందర్భంగా వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ప్రత్యేక గీతాన్ని విడుదల చేశాడు. 'హెలికాప్టర్' పేరుతో వచ్చిన ఈ పాటను ధోనీ క్రికెట్ కెరీర్ను ఆధారంగా చేసుకొని రూపొందించాడు.
ఇది చూడండి : గావస్కర్ పేరిట అరుదైన రికార్డు.. ఏంటంటే!