తెలంగాణ

telangana

ETV Bharat / sports

దిల్లీకి రహానే.. రాయల్స్​తో 100 మ్యాచ్​ల బంధానికి తెర

వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్​లో రాజస్థాన్ ఆటగాడు అజింక్య రహానే దిల్లీ క్యాపిటల్స్​కు ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది.

By

Published : Nov 14, 2019, 4:31 PM IST

Updated : Nov 14, 2019, 5:43 PM IST

రహానే

వచ్చే ఐపీఎల్ సీజన్​లో టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే.. దిల్లీ క్యాపిటల్స్​కు ఆడనున్నాడు. ఐపీఎల్-2020 సీజన్​ కోసం జరిగిన ట్రేడింగ్ విండో పద్ధతికి గురువారమే చివరిరోజు. డిసెంబర్‌ 19న కోల్‌కతాలో ఐపీఎల్‌ వేలం జరగనుంది.

వచ్చే ఏడాది ఐపీఎల్​లోరహానే.. దిల్లీ క్యాపిటల్స్​కు ఆడనున్నట్లు ఇరు ఫ్రాంఛైజీలు స్పష్టం చేశాయి. ఫలితంగా రహానే - రాయల్స్​ మధ్య 100 మ్యాచ్​ల అనుబంధానికి తెరపడింది.

2011లో ముంబయి ఇండియన్స్‌ నుంచి రాజస్థాన్‌కు మారిన రహానే అప్పట్నుంచి ఇదే ఫ్రాంఛైజీకి ఆడుతున్నాడు. 2012 సీజన్‌లో రాజస్థాన్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్​గా నిలిచాడు. ఈ ఆటగాడికి బదులుగా రాజస్థాన్..​ మయాంక్ మార్కండే, రాహుల్ తెవాటియాలను తీసుకుంది.

2008 ఆరంభ సీజన్‌లో టైటిల్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్.. మరో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. ఐపీఎల్ బదిలీ తేదీ ముగిసిన తర్వాత మరి కొంతమంది ఆటగాళ్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది రాజస్థాన్. ఈ జాబితాలో స్టువర్ట్ బిన్నీ, లివింగ్ స్టోన్, ఆష్టన్ టర్నర్, జయదేవ్ ఉనద్కత్​లు ఉన్నారు.

ఇవీ చూడండి.. టీమిండియా జోరు.. బంగ్లా ఆలౌట్.. భారత్​ 86/1

Last Updated : Nov 14, 2019, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details